బీజేపీతోనేదేశాభివృద్ధి సాధ్యం | Sakshi
Sakshi News home page

బీజేపీతోనేదేశాభివృద్ధి సాధ్యం

Published Sun, Apr 7 2024 7:15 AM

సభకు వెళ్లే వాహనాలకు
జెండా ఊపుతున్న నాయకులు - Sakshi

టేక్మాల్‌(మెదక్‌): బీజేపీ అధికారంలోకి వస్తేనే దేశాభివృద్ధి సాధ్యమని జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ అన్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం మండలంలోని పల్వంచ శివారులో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీతో దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగిందన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు నవీన్‌కుమార్‌, నాయకులు రాజు, సిద్దిరాములు ఉన్నారు.

గ్యారంటీలతో భరోసా

నర్సాపూర్‌: కాంగ్రెస్‌పై ప్రజలకు నమ్మకం ఉందని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి అన్నారు. శనివారం తుక్కుగూడలో ఏర్పా టు చేసిన జన జాతర బహిరంగ సభకు పార్టీ నాయకులతో కలిసి తరలివెళ్లారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ పార్టీ ఐదు న్యాయాలు, 25 గ్యారంటీలను పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ప్రజలకు ప్రకటిస్తుందని పేర్కొన్నారు.

రాజ్యాంగం జోలికొస్తే ఊరుకోం

రామాయంపేట(మెదక్‌)/మెదక్‌జోన్‌/నర్సాపూర్‌రూరల్‌: మాల మహానాడు ఆధ్వర్యంలో చేపట్టిన రాజ్యాంగ రక్షణ యాత్ర శనివారం జి ల్లాలోకి ప్రవేశించింది. ఈసందర్భంగా రామాయంపేట, నర్సాపూర్‌, మెదక్‌ పట్టణంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్‌ మాట్లాడారు. రాజ్యాంగాన్ని మార్చాలని కొందరు కుట్ర పన్నుతున్నారని.. వారి ఆటలు సాగ నివ్వమని హెచ్చరించారు. తెలంగాణాలోని అన్ని జిల్లాలో ఈయాత్ర కొనసాగుతుందని తెలిపారు. ఈనెల 8న యాత్ర ముగింపు సభ హైదరాబాద్‌లో నిర్వహిస్తామని.. మాలలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కల్లూరి సంజయ్‌, జిల్లా ఇన్‌చార్జి రాములు, పట్టణ అధ్యక్షుడు ప్రసాద్‌ పాల్గొన్నారు.

పార్టీ జెండాను ఆవిష్కరిస్తున్న బీబీ పాటిల్‌
1/2

పార్టీ జెండాను ఆవిష్కరిస్తున్న బీబీ పాటిల్‌

రామాయంపేట: మాట్లాడుతున్న మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్‌
2/2

రామాయంపేట: మాట్లాడుతున్న మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్‌

Advertisement
Advertisement