మోదీకి ఎంపీ సీటు కానుకగా ఇద్దాం | Sakshi
Sakshi News home page

మోదీకి ఎంపీ సీటు కానుకగా ఇద్దాం

Published Sun, Apr 7 2024 7:15 AM

కార్యకర్తలతో కలిసి టిఫిన్‌ చేస్తున్న శ్రీనివాస్‌ - Sakshi

మెదక్‌జోన్‌: మెదక్‌ పార్లమెంట్‌ నుంచి బరిలో దిగుతున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావును భారీ మెజార్టీతో గెలిపించి నరేంద్ర మోదీకి కానుకగా ఇవ్వాలని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శనివారం బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ కార్యాలయంతో పాటు తన ఇంటి వద్ద బీజేపీ జెండాను అవిష్కరించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి టిఫిన్‌ బైఠక్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్‌, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కాశీనాథ్‌, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌

Advertisement
Advertisement