నేటి ప్రజావాణి రద్దు | Sakshi
Sakshi News home page

నేటి ప్రజావాణి రద్దు

Published Mon, Apr 8 2024 8:15 AM

-

మెదక్‌ కలెక్టరేట్‌: పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులు, సిబ్బంది పార్లమెంట్‌ ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

నూతన కార్యవర్గం

సదాశివపేట రూరల్‌ (సంగారెడ్డి): నిరుద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆ దివారం మండల పరిధిలోని అంకేనపల్లిలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నిరుద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా పి.రవీందర్‌, ఉపాధ్యక్షుడిగా భగవాన్‌ రావు, ప్రధాన కార్యదర్శిగా గొల్ల రాములు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా శివరాజ్‌ పాటిల్‌, సంయుక్త కార్యదర్శిగా పి. మల్లేశంలను ఎన్నుకున్నారు.

Advertisement
Advertisement