థ్రిల్లింగ్‌ శబ్దం  | Sakshi
Sakshi News home page

థ్రిల్లింగ్‌ శబ్దం 

Published Sat, Apr 13 2024 3:50 AM

Aadhi Pinisetty Sabdham Teaser Release - Sakshi

హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్‌ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘శబ్దం’. ఈ సూపర్‌ నేచురల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీలో సిమ్రాన్, లైలా లీడ్‌ రోల్స్‌లో నటించగా, 7జీ శివ నిర్మించారు. తెలుగు–తమిళ భాషల్లో రూపొందిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘శబ్దం’ టీజర్‌ను హీరో వెంకటేశ్‌ షేర్‌ చేశారు.

‘‘ఆది పినిశెట్టి– అరివళగన్‌ కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘వైశాలి’ విజయం సాధించింది. ఇప్పుడు ‘శబ్దం’ వస్తోంది. ఈ సినిమాలోని చాలా సన్నివేశాలను పర్వతాలు, పర్యాటక ప్రదేశాల్లో చిత్రీకరించాం. అలాగే 120 ఏళ్ల క్రితం నాటి లైబ్రరీని కూడా నిర్మించాం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని యూనిట్‌ పేర్కొంది. 

Advertisement
Advertisement