Aishwarya Rajesh Scenes Deleted From Dhruva Natchathiram - Sakshi
Sakshi News home page

Aishwarya Rajesh: ధ్రువ నక్షత్రం చిత్రంలో ఐశ్వర్య రాజేష్‌ సీన్స్‌ కట్‌?

Published Sun, Jul 23 2023 9:20 AM

Aishwarya Rajesh Scenes Deleted From Dhruva Natchathiram - Sakshi

ధ్రువ నక్షత్రం చిత్రంలో నటి ఐశ్వర్య రాజేష్‌ నటించిన సన్నివేశాలను తొలగించారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. విక్రమ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ధ్రువ నక్షత్రం. ఇందులో నటి రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్‌, సిమ్రాన్‌, నటుడు పార్టీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి హరీష్‌ జయరాజ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం 2017లో ప్రారంభమైంది. షూటింగ్‌ కూడా పూర్తి చేసుకుని రెండేళ్ల క్రితం విడుదల కావాల్సింది. అయితే అనివార్య కారణాల వల్ల చిత్రం విడుదల వాయిదా పడుతూ వచ్చింది.

అలా అటకెక్కిన ఈ చిత్రాన్ని దాదాపు 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు బూజు దులుపుతున్నారు. ఇటీవల ఈ చిత్రంలోని మనం అనే పాటను విడుదల చేశారు. తాజాగా హిజ్‌ నేమ్‌ ఈజ్‌ జాన్‌ అనే మరో పాటను విడుదల చేశారు. అసలు విషయం ఏమిటంటే ఈ చిత్ర కథను దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసినట్లు సమాచారం.

అందులో భాగంగా ఇప్పటికే చిత్రీకరించిన నటి ఐశ్వర్య రాజేష్‌కు సంబంధించిన సన్నివేశాలు అన్నింటిని తొలగించినట్లు, ఆమె లేకుండా మళ్లీ కొంత భాగాన్ని చిత్రీకరించినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడ లేదు. కాగా పలు సక్సెస్‌ఫుల్‌ చిత్రాల్లో నటించిన నటి ఐశ్వర్య రాజేష్‌ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారన్న విషయం తెలిసిందే.

Advertisement

తప్పక చదవండి

Advertisement