Sakshi News home page

Pushpa Pre Release Allu Arjun Speech: ఈ వేదికపై వారిని మిస్‌ అవుతున్న: బన్నీ

Published Mon, Dec 13 2021 9:17 AM

Allu Arjun Interesting Comment In Pushpa Movie Pre Release Event - Sakshi

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌-క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో తాజాగా తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం స్మిగ్లింగ్‌ నేపథ్యంలో పాన్‌ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో తొలి పార్ట్‌ను ‘పుష్ప ది రైజ్‌’ పేరుతో డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పుష్ప టీం ప్రమోషన్‌ కార్యక్రమాలతో బిజీగా ఉంది. దీంతో ఆదివారం పుష్ప ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ను జరుపుకుంది. ఈ ‍కార్యక్రమానికి దర్శకు ధీరుడు రాజమౌళి, కొరటాల శివ, నిర్మాత అల్లు అరవింద్‌ ముఖ్య అతిథిలుగా వచ్చారు. ఈ సందర్భంగా బన్నీ ఇండస్ట్రీకి దొరికిన గిఫ్ట్‌ అంటూ రాజమౌళి అల్లు అర్జున్‌పై ప్రశంసలు కురింపించాడు.  

అనంతరం అల్లు అర్జున్‌ మాట్లాడుతూ.. ‘‘సుకుమార్, దేవి, నేను ఒకేసారి జర్నీ స్టార్ట్‌ చేశాం. ఇప్పుడు ఈ వేదికపై వారిని మిస్‌ అవుతున్నాను. ఆర్‌ఆర్‌ఆర్‌ బాగా ఇచ్చేందుకు దేవి ఇక్కడికి రాలేకపోయాడు. ఈ ఒక్క సినిమా.. అన్ని విధాలుగా నాలుగు సినిమాల కష్టం లాంటిది. మైత్రీవారితో పాటు ఈ సినిమాలో ముత్తం శెట్టివారు నిర్మాణంలో భాగమయ్యారు. మా మావయ్య (రవి, విజయ్, కృష్ణ, రాజేంద్రప్రసాద్‌) లతో ముత్తంశెట్టి మీడియా బ్యానర్‌ పెట్టించి వారితో ఓ సినిమా చేయించాను. నేను పెరిగిన రోజుల్లో మా మావయ్యలు నాకెంతో ప్రేమను చూపించారు. ఇవాళ నా ప్రేమను చూపించుకునేందుకు ఓ అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. అయితే ‘పుష్ప’ మొదలైన తర్వాత రాజేంద్రప్రసాద్‌గారు చనిపోయారు. ఈ సినిమాను ఆయన కూడా చూసి ఉంటే బాగుండేది’’ అన్నారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ఇక సుకుమార్‌ కూతురు సుకృతి మాట్లాడుతూ ‘‘నాన్న ఈ మధ్య అస్సలు ఇంటికి రావడంలేదు. ‘పుష్ప’ క్లిప్స్‌ చూశాను. బాగున్నాయి. ఈ చిత్రాన్ని సపోర్ట్‌ చేయండి’’ అని సుకుమార్‌ కుమార్తె  పేర్కొంది. ఈ కార్యక్రమంలో నటుడు సునీల్, కెమెరామ్యాన్‌ క్యూబా, దర్శకులు మారుతి, వెంకీ కుడుముల, బుచ్చిబాబు సన, అల్లు అర్జున్‌ కుమారుడు అయాన్, తనయ అర్హ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement