మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న 'ఎవడు' సినిమా హీరోయిన్ | Sakshi
Sakshi News home page

Amy Jackson: ఫైనల్‌గా ప్రియుడికి యస్ చెప్పిన రామ్‌చరణ్ హీరోయిన్

Published Mon, Jan 29 2024 6:55 PM

Amy Jackson Marriage With Boyfriend Ed Westwick Pics Viral - Sakshi

రామ్ చరణ్ 'ఎవడు' సినిమాలో హీరోయిన్‌గా నటించిన అమీ జాక్సన్ గుర్తుందా? ఇప్పుడు ఆమె రెండో పెళ్లికి సిద్ధమైపోయింది. గతంలో కొన్నాళ్ల ఓ వ్యక్తితో డేటింగ్ చేసిన ఈ ముద్దుగుమ్మకు ఓ కొడుకు పుట్టాడు. ఆ తర్వాత మనస్పర్థలు కారణంగా అతడి నుంచి విడిపోయింది. ఆ తర్వాత బ్రిటీష్ నటుడితో ప్రేమలో పడింది. గత కొన్నాళ్లుగా రిలేషన్‌లో ఉన్న ఈ జంట ఇప్పుడు ఒక్కటయ్యేందుకు రెడీ అయిపోయారు.

(ఇదీ చదవండి: నిశ్చితార్థం జరిగిన నాలుగేళ్లకు పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్)

విదేశాల్లో పుట్టి పెరిగిన అమీ జాక్సన్ తొలుత మోడలింగ్ చేసింది. ఆ తర్వాత 'మద్రాసు పట్టణం' అనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా కెరీర్ మొదలుపెట్టింది. తమిళంతో పాటు తెలుగులోనూ రామ్ చరణ్ 'ఎవడు' చిత్రంలో ఓ హీరోయిన్‌గా చేసింది. ఆ తర్వాత 'అభినేత్రి' అనే ద్విభాషా చిత్రంలోనూ నటించింది. ఈ రెండు తప్పితే తమిళ, హిందీలోనే ఎక్కువగా మూవీస్ చేసింది.

గతంలో జార్జ్ పనయాట్టు అనే వ్యక్తితో కొన్నాళ్లు డేటింగ్ చేసిన అమీ జాక్సన్.. అతడితో ఓ కొడుక్కి జన్మనిచ్చింది. ఏమైందో ఏమో గానీ అతడి నుంచి విడిపోయింది. ఇది జరిగిన తర్వాత కొన్నాళ్లకు విదేశీ నటుడు ఎడ్ వెస్ట్‌విక్‌తో ప్రేమలో పడింది. ఈ విషయం నేరుగా చెప్పనప్పటికీ కలిసి బయట కనిపించడంతో అందరూ కన్ఫర్మ్ చేసుకున్నారు. తాజాగా స్విట్జర్లాండ్‌లోని మంచు పర్వతాల్లో ఇతడు లవ్ ప్రపోజ్ చేశాడు. అమీ జాక్సన్ దీన్ని అంగీకరించింది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలో వీళ్ల పెళ్లి ఉండొచ్చు.

(ఇదీ చదవండి: సీరియల్ హీరోయిన్‌ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్)

Advertisement
Advertisement