జగన్తోనే సంక్షేమం
కాకినాడ రూరల్: ఈ ఎన్నికలు చాలా కీలమైనవి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో శెట్టిబలిజలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. మీరంతా విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలి. జగన్మోహన్రెడ్డితోనే సంక్షేమం సాధ్యమవుతుంది. చంద్రబాబు బోగస్ హామీలు నమ్మవద్దని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్బోస్ పిలుపునిచ్చారు. సర్పవరం జంక్షన్ వద్ద కాకినాడ రూరల్ నియోజకవర్గ శెట్టిబలిజ ఆత్మీయ సమావేశం జెడ్పీటీసీ సభ్యుడు, శెట్టిబలిజ నేత నురుకుర్తి రామకృష్ణ అధ్యక్షత మంగళవారం జరిగింది. సమావేశానికి నియోజకవర్గంలోని శెట్టిబలిజలు భారీగా తరలివచ్చారు. ముఖ్య అతిథులుగా పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, వైఎస్సార్ సీపీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కురసాల కన్నబాబు, ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ హాజరయ్యారు. బోస్ మాట్లాడుతూ చైతన్యవంతులైన శెట్టిబలిజలు తమ ఓటు వినియోగించుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయాలన్నారు. వైఎస్సార్ సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు సునీల్, కన్నబాబు మంచి మనుషులని, పిలిస్తే పలికే వారికి ఓటు వేసి గెలిపించాలని పిలుపు ఇచ్చారు. ఉన్నత విద్యావంతులైన ఈ ఇద్దరు అభ్యర్థుఽలు ప్రత్యర్థి పార్టీ అభ్యర్థుల కంటే మెరుగైనవారన్నారు. చంద్రబాబునాయుడు ఆచరణ సాధ్యం కాని హామీలతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నందున నమ్మవద్దన్నారు. చంద్రబాబు హామీలకు ఏటా రూ.లక్షా 60వేల కోట్లు అవుతుందన్నారు. జగన్మోహన్రెడ్డి మేనిఫెస్టోపై ప్రజల్లో విశ్వాసం ఉందన్నారు. చేయగలిగిన హామీలనే ఆయన ఇచ్చారన్నారు. టీడీపీకి 40 ఏళ్లుగా వెన్నెముకగా ఉన్న బీసీలు ఇప్పుడు ఆ పార్టీకి దూరమయ్యారన్నారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలు కింద రూ.రెండు లక్షల 60 వేల కోట్లు వెచ్చించారన్నారు.
బీసీలకు ప్రాధాన్యం ఇచ్చిన నేత జగన్ : కన్నబాబు
రాష్ట్రంలో నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనార్టీలు అని చెప్పుకునే జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో పని చేస్తున్నందుకు తామంతా గర్వంగా ఫీలవుతున్నామని వైఎస్సార్ సీపీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. గత ఐదేళ్ల పాలనలో సీఎం జగన్ శెట్టిబలిజ కులస్తులకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారన్నారు. జగన్ కేబినెట్లో బీసీలకు ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి పదవిని శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన పిల్లి సుభాష్చంద్రబోస్కు ఇచ్చారని గుర్తు చేశారు. బీసీలకు రెండు రాజ్యసభ సీట్లు ఇస్తే అందులో ఒకటి బోస్కు ఇచ్చారని, ఎమ్మెల్సీలు రెండు ఇస్తే అందులో ఒకటి పాత పశ్చిమ గోదావరి జిల్లాకు, మరొకటి పాత తూర్పు గోదావరి జిల్లాకు ఇచ్చారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జిల్లా పరిషత్ స్థానం శెట్టిబలిజకు ఇచ్చారని, ఈ ఎన్నికల్లో రాజమహేంద్రవరం, నరసాపురం ఎంపీ సీట్లు శెట్టిబలిజకు ఇచ్చారన్నారు. ఈ ప్రాంతంలో బలమైన సామాజికవర్గం శెట్టిబలిజ అన్నారు. వైఎస్సార్ సీపీ ఒక కులానికి సంబంధించిన పార్టీ కాదని, అందరి పార్టీ అన్నారు. జనసేనలో శెట్టిబలిజలకు ప్రాధాన్యం లేదన్నారు.
కాకినాడ రాత మారుస్తా :
ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్
కాకినాడ ఎంపీగా తనను గెలిపించండి కాకినాడ రాత మారుస్తానని వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ కోరారు. మీ పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇస్తానన్నారు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 400గ్రామాలను దత్తత తీసుకుని ఒక్కో గ్రామాన్ని రూ.కోటితో అభివృద్ధి చేస్తానన్నారు. తీర ప్రాంతం, ఎస్ఈజెడ్, పోర్టులు, ఎయిర్ పోర్టు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండడంతో రూ.30వేల కోట్లతో పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తానన్నారు. నిరుద్యోగులకు ఏటా 5వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేస్తామన్నారు. చిన్న, మధ్య తరగతి నిరుద్యోగులను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఇంక్యుబేషన్ సెంటర్ను రూ.100 కోట్లతో ఏర్పాటు చేస్తామన్నారు. తనతో పాటు కన్నబాబును గెలిపించాలని కోరారు. సీఎం జగన్తో సామాజిక న్యాయం సాధ్యవుతుందని, ఆయన కొనసాగాలన్నా, మంచి జరగాలన్నా ఆలోచించి ఓటు వేయాలని కోరారు. జెడ్పీటీసీ సభ్యుడు గుబ్బల తులసీకుమార్, కరప ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి సత్తిబాబు, ఏఎంసీ చైర్మన్ గీసాల శ్రీను, జేసీఎస్ కన్వీనర్ గీసాల శ్రీనివాసరావు, దూనబోయిన అరుణ, వాసంశెట్టి రాజేశ్వరరావు, పార్లమెంట్ పరిశీలకులు, మాజీ మేయర్ సరోజ, యనమదల రవి, రాజమహేంద్రవరానికి చెందిన శ్రీను, కడియాల చిన్నా, గంజా సత్తిబాబు, పాలిక నరసింహమూర్తి పాల్గొన్నారు. చంద్రబాబు హామీలు బోగస్
వైఎస్సార్ సీపీ అభ్యర్థులు
కన్నబాబు, సునీల్ను గెలిపించండి
శెట్టిబలిజ ఆత్మీయ సమావేశంలో
రాజ్యసభ సభ్యుడు సుభాష్చంద్రబోస్