పదేళ్ల తర్వాత సీక్వెల్‌ | Sakshi
Sakshi News home page

పదేళ్ల తర్వాత సీక్వెల్‌

Published Sun, Jan 3 2021 6:22 AM

Dhanush-Selvaraghavan join forces for Yuganiki Okkadu 2 - Sakshi

సెల్వ రాఘవన్‌ దర్శకత్వంలో 2010లో వచ్చిన భారీ యాక్షన్‌ చిత్రం ‘ఆయిరత్తిల్‌ ఒరువన్‌’. తెలుగులో ‘యుగానికి ఒక్కడు’గా విడుదలైంది. కార్తీ, రీమాసేన్, ఆండ్రియా ముఖ్య పాత్రల్లో నటించారు. పదేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌ను ప్రకటించారు దర్శకుడు సెల్వరాఘవన్‌. అయితే ఈ సినిమాలో ధనుశ్‌ హీరోగా నటించనున్నారు. 2024లో విడుదల కానుందట. ‘‘ఇదో భారీ చిత్రం. ప్రీ–ప్రొడక్షన్‌ పనులకే సుమారు ఏడాది సమయం పడుతుంది. సినిమా రావడానికి కాస్త టైమ్‌ పడుతుంది. కానీ అద్భుతమైన సినిమా అందిస్తాం’’ అన్నారు ధనుశ్‌.

Advertisement
Advertisement