సినిమా హీరోయిన్లు బయటకు నవ్వుతూ కనిపించినా ఇబ్బందులు పడుతూనే ఉంటారు. సెట్లో కావొచ్చు.. పబ్లిక్ ప్లేస్లో కావొచ్చు అభిమానులం అని చెప్పి, కొందరు వీళ్లతో అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు. ఎంత అప్రమత్తంగా ఉన్నా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మాత్రం ఓ తెలుగు దర్శకుడు పబ్లిక్గా హీరోయిన్కి ముద్దుపెట్టేశాడు.
(ఇదీ చదవండి: 'సలార్' కోసం ఆ సాహసం చేస్తున్న శ్రుతి హాసన్)
బాలకృష్ణతో 'వీరభద్ర', గోపీచంద్తో 'యజ్ఞం', సాయిధరమ్ తేజ్తో 'పిల్లా నువ్వు లేని జీవితం' తదితర సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఏఎస్ రవికుమార్.. ఇప్పుడు రాజ్ తరుణ్ హీరోగా 'తిరగబడరా సామీ' సినిమా తీశాడు. ఇందులో హీరోయిన్ మన్నారా చోప్రా.. ఓ కీలక పాత్రలో నటించింది.
తాజాగా సినిమా ప్రమోషన్స్ నిర్వహించగా, దానికి చిత్రబృందం హాజరయ్యారు. ఈవెంట్ అయిపోయిన తర్వాత ఫొటోలకు పోజులిస్తుండగా హీరోయిన్ మన్నారా చోప్రా అనుమతి లేకుండా ఆమెకు ముద్దుపెట్టేశాడు. ఆమె నవ్వేసి ఊరుకుంది గానీ వీడియో చూస్తుంటే మాత్రం కాస్త ఇబ్బందిగా ఫీలైనట్లు అనిపిస్తోంది. దీంతో నెటిజన్స్.. సదరు డైరెక్టర్ తీరుపై విమర్శిస్తున్నారు. గతంలో ఇలానే కాజల్ స్టేజీపై మాట్లాడుతుండగా సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు ముద్దుపెట్టేశాడు.
(ఇదీ చదవండి: ఆ రూమర్స్పై స్పందించిన నాగచైతన్య.. అవన్నీ!)
Director kisses an actress earlier today!pic.twitter.com/JzyBbau45d
— Manobala Vijayabalan (@ManobalaV) August 28, 2023