Sakshi News home page

కార్తీ, కమల్‌ ప్రాజెక్ట్‌లను కాదని కమెడియన్‌తో సినిమా తీస్తున్న స్టార్‌ డైరెక్టర్‌

Published Mon, Jan 22 2024 1:45 PM

Director Vinoth Next Movie With Comedian - Sakshi

హిట్‌ చిత్రాలకు కేరాఫ్‌గా మారిన దర్శకుడు హెచ్‌.వినోద్‌. అజిత్‌తో వలిమై,తెగింపు చిత్రాలతో పాటు బాలీవుడ్‌ హిట్‌ సినిమా అయిన పింక్‌ చిత్రాన్ని కూడా తమిళ్‌లో వినోద్‌ డైరెక్ట్‌ చేశాడు. కార్తీతో ఖాకీ చిత్రాన్ని తీసి టాలీవుడ్‌లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన తదుపరి ప్రాజెక్ట్‌ కమలహాసన్‌ కథానాయకుడిగా రాజ్‌ కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై ఓ చిత్రం చేయడానికి సిద్ధం అయ్యారు. దీనికి సంబంధించిన కథా చర్చలు జరిగాయి. ఇది వ్యవసాయ నేపథ్యంలో రూపొందనుందనే ప్రచారం జరిగింది. అలాంటిది ఇప్పుడు ఈ చిత్రం తెరకెక్కించడానికి మరింత సమయం పట్టనుందనే టాక్‌ వినిపిస్తోంది.

కాగా ఇంతకు ముందు నటుడు కార్తీతో ఖాకీ చిత్రానికి సీక్వెల్‌ చేస్తానని కూడా ఆయన ప్రకటించారు. కానీ ఆ ప్రాజెక్ట్‌ గురించి ఎలాంటి సమాచారం లేదు. దీంతో నటుడు కార్తీ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. కమలహాసన్‌ హీరోగా చేసే చిత్రం కూడా వాయిదా పడడంతో హెచ్‌.వినోద్‌ మధ్యలో ఓ చిత్రాన్ని చేయడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. ఇందులో నటుడు యోగిబాబు హీరోగా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇది రాజకీయ వ్యంగ్యాస్త్రాలతో వినోద భరిత కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement