Kangana Ranaut: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ నటి
Published
Sat, Jan 1 2022 10:59 AM
నూతన సంవతసరం సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కూడా నేడు శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం(జనవరి 1) ఉదయం 2 గంటలకు వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం రంగనాయకుల మండపంలో కంగనాకు వేద పండితులు ఆశీర్వాదాల అందించారువ. అలాగే ఆలయ అర్చకులు పట్టు వస్రాలతో ఆమెను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.