Bipasha Basu: పెళ్లైన ఆరేళ్లకు తల్లి కాబోతున్న హీరోయిన్
Published
Fri, Jul 29 2022 4:58 PM
తన అందచందాలతో కుర్రకారును అల్లాడించింది బిపాషా బసు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ఆమె ప్రస్తుతం కరణ్ సింగ్ గ్రోవర్తో జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. కాగా వీరిద్దరూ 'ఎలోన్' సినిమాలో జంటగా నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. కొన్ని నెలల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట 2016లో పెళ్లి చేసుకుంది.
ఆరేళ్లుగా ఎంతో అన్యోన్యంగా కలిసి జీవిస్తున్నారిద్దరూ. ఇదిలా ఉంటే తాజాగా బిపాషా తల్లి కాబోతుందంటూ ఓ వార్త ఫిల్మీదునియాలో వైరల్గా మారింది. త్వరలోనే ఈ విషయాన్ని వారు అధికారికంగా ప్రకటించబోతున్నారట. దీంతో అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్. మరి బిపాషా దీనిపై ఏమంటుందో చూడాలి!