'మీసాల రాజు గారికి మీసాలు తీసేశారంట! ఎందుకు?'.. ఆసక్తికరంగా కొరమీను టైటిల్ పోస్టర్ | Sakshi
Sakshi News home page

Koraminu Motion Poster: 'కొరమీను' టైటిల్ పోస్టర్ విడుదల చేసిన లావణ్య త్రిపాఠి

Published Sun, Oct 30 2022 7:08 PM

Lavanya Tripathi released the title motion poster of Koraminu - Sakshi

ఆనంద్ రవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'కొరమీను'. ఈ సినిమాకు శ్రీపతి కర్రి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీలో హీరో ఆనంద్ రవి ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో పాటు టైటిల్ కూడా వెల్లడించారు. ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్‌ను హీరోయిన్ లావణ్య త్రిపాఠి చేతుల మీదుగా రిలీజ్ చేశారు.
 
'మీసాల రాజు గారికి మీసాలు తీసేశారంట! ఎందుకు?' అంటూ కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఓ పోస్టర్ ఆసక్తి కలిగిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఆ పోస్టర్ విడుదల చేశారు. ఆనంద్ రవి ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కూడా ఓ బోట్ మీద ఆ లైన్స్ కనిపించాయి. 'కోరమీను' ఫస్ట్ లుక్, టైటిల్ మోషన్ పోస్టర్ చూస్తే సముద్ర తీర ప్రాంతంలో జరిగే కథగా తెలుస్తోంది. సముద్ర తీరంలో ఆనంద్ రవి ఫస్ట్ లుక్ ఆసక్తి కలిగించేలా ఉంది. ఒక బోట్ పై 'మీసాల రాజ్ మీసాలు ఎవరో కత్తిరించారా! ఎందుకు?' క్యాప్షన్ కూడా రాసి ఉంది. 

దర్శకుడు శ్రీపతి కర్రి మాట్లాడుతూ.. 'ఈ మూవీలో జాలరిపేట అనే మత్స్యకారుల కాలనీ నేపథ్యంలో కథ సాగుతుంది. ముగ్గురి పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది. మంచి కంటెంట్‌తో వస్తున్న చిత్రమిది. అందరికీ నచ్చుతుంది' అని అన్నారు. కోటి పాత్రలో ఆనంద్ రవి, కరుణగా హరీష్ ఉత్తమన్, మీసాల రాజు పాత్రలో శత్రు, మీనాక్షిగా కిషోరీ దత్రక్, దేవుడు పాత్రలో రాజా రవీంద్ర, సీఐ కృష్ణ పాత్రలో గిరిధర్, ముత్యంగా 'జబర్దస్త్' ఇమ్మాన్యుయెల్, సుజాతగా ఇందు కుసుమ, వీరభద్రమ్ పాత్రలో ప్రసన్న కుమార్, కరుణ అసిస్టెంట్ పాత్రలో ఆర్కే నాయుడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement
Advertisement