Sakshi News home page

డబ్బింగ్‌ పనుల్లో ‘మిస్టరీ’

Published Tue, Aug 1 2023 2:14 PM

Mystery Movie Latest Update - Sakshi

తల్లాడ సాయికృష్ణ హీరోగా స్వీయదర్శకత్వంలో టించిన చిత్రం మిస్టరీ. స్వప్న చౌదరి హీరోయిన్‌. అలీ, సుమన్‌, తనికెళ్ల భరణి తదితరులు ఇతర కీలపాత్రల్లో నటించారు. పీవీ ఆర్ట్స్‌ పతాకంపై వెంకట్‌ పులగం నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం చిత్రబృందం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది.

తాజాగా ఈ చిత్రంలోని తన పాత్రకు అలీ డబ్బింగ్‌ చెప్పారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ.. ‘ఇదొక థ్రిల్లర్‌ కామెడీ సినిమా. సాయి అనుకున్న కథని అనుకున్నట్లుగా తీశాడు. నా పాత్ర డబ్బింగ్‌ పూర్తయింది. సినిమా చాలా బాగా వచ్చింది. అందరికి నచ్చుతుంది. టీమ్‌ అందరికి నా అభినందనలు’అని అన్నారు.

Advertisement
Advertisement