Sakshi News home page

Mukesh Udeshi: కొన్నిరోజుల్లో ఆపరేషన్.. ఇంతలోనే నిర్మాత మృతి

Published Tue, Sep 12 2023 7:55 PM

Producer Mukesh Udeshi Died With Kidney Disease - Sakshi

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవితో పలు సూపర్ హిట్ సినిమాలు తీసిన నిర్మాత ముకేశ్ ఉద్దేశి.. సోమవారం కన్నుమూశారు. ఈ విషయం ఒకరోజు తర్వాత అంటే మంగళవారం బయటకొచ్చింది. గత కొన్నాళ్లుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఈయన.. చెన్నైలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 

(ఇదీ చదవండి: యాంకర్ రష్మీ పరువు తీసిన బుల్లెట్ భాస్కర్!)

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడంటే తెలుగు సినిమాలు మాత్రమే చేస్తున్నారు. గతంలో హిందీలో 'ప్రతిబంధ్', 'ద జెంటిల్‌మ్యాన్' సినిమాలు చేశారు. వీటితోపాటు తెలుగులో 'ఎస్పీ పరశురాం' చిత్రం చేశారు. వీటికి నిర్మాతగా వ్యవహరించింది ముకేశ్ ఉద్దేశినే. నిర్మాతగా పలు మూవీస్ తీసిన ఈయన.. ఆ తర్వాత కొన్నాళ్లకు లైన్ ప్రొడ్యూసర్ అయ్యారు. గో గోవా డాన్, ద విలన్, ద షౌకీన్స్, బ్రేక్ కే బాద్, సారీ భాయ్, కిడ్నాప్, ప్యార్ మైన్ ట్విస్ట్, చష్మే బద్దూర్ సినిమాలకు లైన్ ప్రొడ్యూసర్‌గా చేశారు.

గత కొన్నాళ్ల నుంచి కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఈయన్ని ప్రస్తుతం అల్లు అరవింద్ చూసుకుంటున్నారు. త్వరలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్ కోసం అన్ని సిద్ధం చేశారు. కానీ ఇంతలోనే ఇలా ముకేశ్ చనిపోవడం ఆయన కుటుంబంతో పాటు ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' రెండో వారం నామినేషన్స్.. లిస్టులో తొమ్మిది మంది!)

Advertisement

What’s your opinion

Advertisement