Sakshi News home page

'వ్యూహం' కోసం ఎవరి పర్మిషన్ అవసరం లేదు.. వర్మ సంచలన కామెంట్లు

Published Fri, Oct 13 2023 2:11 PM

Ram Gopal Varma Comments On Vyuham Movie - Sakshi

సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ  ‘వ్యూహం’ అనే సినిమాని తెరకెక్కిస్తున్న విషం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను ఆయన తాజాగా విడుదల చేశారు. ఇప్పటికే ఆయన పలు బయోపిక్‌ సినిమాలను ఉన్నది ఉన్నట్లుగా తీసి మంచి గుర్తింపు పొందాడు. తాజాగా వ్యూహం, శపథం అనే రెండు భాగాలతో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్‌ మోహన్‌ రెడ్డి గార్ల జీవిత చరిత్రలను ఆయన తెరకెక్కిస్తున్నాడు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. 'ఈ సినిమా వెనుక ఎలాంటి వ్యూహం లేదు. ఈ మూవీలో నిజం మాత్రమే ఉంది. వ్యూహం రెండు భాగాలుగా వస్తుంది. వైఎస్  రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలతో ఈ రెండు సినిమాలు ఉంటాయి. నేను చాలా సౌమ్యుడిని. నేను ఎప్పుడు చంద్రబాబుని కలవలేదు. నాకు జగన్ గారు అంటే ఒక అభిప్రాయం ఉంది. అలాగే చంద్రబాబు గారు అంటే కూడా ఒక అభిప్రాయం ఉంది. కానీ నిజమనేది మాత్రమే ఈ సినిమాలో ప్రజలు చూస్తారు. జగన్ గారి మీద నాకు ఉన్న అభిప్రాయం వ్యూహం సినిమాలో కనపడుతుంది.

మిగతా వారిపై నాకు ఎలాంటి అభిప్రాయం లేదు... నేను వేరే వాళ్ల మీద సినిమా తియ్యమంటే తియ్యను. ఈ సినిమాలో నేను నమ్మిన నిజం ఉంది. పబ్లిక్ డొమైన్‌లో ఉన్న జీవితాలను సినిమా తియ్యడానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు. నేను గతంలో లక్ష్మిస్ ఎన్టీఆర్ , సర్కార్ వంటి సినిమాలు అలా తీసినవే. నేను జగన్ గారి మీద ఉన్న అభిమానంతో సినిమా తీశాను. కానీ ఇక్కడ ప్యాకేజ్ అనేదానికి ఆస్కారం లేదు. నాకు టీడీపీ గురించి కానీ వైసీపీ గురించి కానీ వేరే పార్టీ గురించి కానీ తెలీదు. నేను నమ్మిన నిజం మాత్రమే సినిమాలో చూపిస్తున్నాను. నా రీసెర్చ్‌లో వెనుక ఏమి జరిగింది అనేదే ఈ సినిమా. ఈ సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవి గారి పాత్ర కూడా ఉంది.

ఆ కష్టాలు జగన్‌ గారు మాత్రమే పడ్డారు

దేశంలో ఏ ముఖ్యమంత్రి కొడుకు కూడా పడని కష్టాలు వైఎస్‌ జగన్ గారు పడ్డారు. అందుకే ఈ సినిమా తిస్తున్నట్లు వ్యూహం నిర్మాత దాసరి కిరణ్ కుమార్ చెప్పారు.  కూడు గుడ్డ లేని వారికి పేద ప్రజల సంక్షేమానికి జగన్ గారి ప్రభుత్వం ఎంతో చేస్తుంది. దీంతో ఆయన ప్రజల గుండెళ్లో చిరస్థాయిగా ఉంటారు. ప్రజలు మళ్లీ వైఎస్‌ జగన్ గారికే పట్టం కడతారు. ఇదే తథ్యం అని కిరణ్‌ కుమార్‌ అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement