నిజ జీవిత సంఘటనల ఆధారంగా అన్ని భాషల్లోనూ సినిమాలు వస్తున్నాయి. అలా కొన్నిరోజుల ముందు 'రజాకార్' చిత్రం తెలుగులో రిలీజైంది. అనసూయ, ఇంద్రజ, బాబీ సింహా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది.
మార్చి 15న థియేటర్లలోకి వచ్చిన 'రజాకార్'.. ప్రేక్షకులకు తెలియకుండానే థియేటర్లలో మాయమైపోయింది. ఒకప్పుడు తెలంగాణలో రజాకార్లు సాగించిన హింస కాండ ఆధారంగా యాటా సత్యనారాయణ ఈ సినిమాని తెరకెక్కించారు.
'రజాకార్' సినిమా డిజిటల్ హక్కుల్ని జీ5 ఓటీటీ సంస్థ దక్కించుకుంది. ఇకపోతే ఏప్రిల్ 26న లేదా మే 3న ఈ చిత్రాన్ని ఓటీటీలో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై అధికారిక ప్రకటన రావల్సి ఉంది.