లేడీ సింగమ్ శక్తీ శెట్టిగా మారారు దీపికా పదుకోన్. ‘సింగమ్’, ‘సింగమ్ రిటర్న్స్’ చిత్రాల తర్వాత బాలీవుడ్ ‘సింగమ్’ ఫ్రాంచైజీలో రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘సింగమ్ ఎగైన్’. అజయ్ దేవగన్ మెయిన్ లీడ్ హీరోగా, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్, కరీనా కపూర్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా నుంచి దీపికా పదుకోన్ ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. ‘సింగమ్ ఎగైన్’ చిత్రంలో లేడీ సింగమ్ పోలీసాఫీసర్ శక్తీ శెట్టి పాత్రలో దీపికా నటిస్తున్నారని, కథ రీత్యా క్రూరమైన, హింసాత్మక ధోరణిలో శక్తీ శెట్టి పాత్ర ఉంటుందని రోహిత్ శెట్టి పేర్కొన్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల కానుంది.
Breadcrumb
శక్తీ శెట్టి.. లేడీ సింగమ్
Published Mon, Oct 16 2023 6:18 AM
Related news
-
ఓటేసేందుకు అమెరికా నుంచి వచ్చిన స్టార్ హీరో కూతురు
ఏప్రిల్ 26న కర్ణాటకలో రెండో దశ ఎన్నికలు జరిగాయి. సామాన్య ప్రజలతో పాటు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొని తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా ప్రజలు తమ గ్రామాలకు చేరుకుని ఓటు వేశారు. ఈ కోవలో కన్నడ టాప్ హీరో దునియా విజయ్ కూతురు మోనిషా కూడా ఉన్నారు.ఇదిలా ఉంటే దునియా విజయ్ కూతురు మోనిషా అమెరికాలోని న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో చదువుతుంది. ఏప్రిల్ 26న ఎన్నికలు ఉండటంతో తన ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు ఆమెరికా నుంచి బెంగళూరుకు చేరుకుంది. తండ్రి మాదిరి మోనిషా కూడా సినిమా రంగంలో రాణించాలని కోరుకుంటుంది. ఈ విషయంపై ఆమె ఇలా చెప్పింది. 'నేనూ, మా చెల్లి మోనికా ఇద్దరమూ సినిమా రంగంపై ఆసక్తి చూపుతున్నాం. నాన్నకు మొదట నచ్చలేదు. సినిమాల్లోకి వద్దని ఆయన చెప్పారు. కానీ, నా సీరియస్నెస్ చూసి ఒప్పుకున్నారు.సినిమా ఇండస్ట్రీకి వస్తే సరైన శిక్షణ తీసుకోవాలని నాన్న గారు సూచించారు. నటనతో పాటు సినిమాల్లోని వివిధ దశలు, సాంకేతికత, మీడియాను ఎలా ఎదుర్కోవాలి, నన్ను నేను ఎలా రక్షించుకోవాలి.. ఇలా అన్నీ సరిగ్గా నేర్చుకుని రావాలని నాన్న సూచించారు. దీంతో న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో నన్ను చేర్పించారు. ప్రస్తుతం అక్కడే చదువుకుంటున్నాను. కోర్సు పూర్తయ్యాక శాండల్ వుడ్కి తప్పకుండా వస్తాను.' అని చెప్పింది మోనిషా.బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం వీరసింహారెడ్డి. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు దునియా విజయ్. కన్నడలో ఎన్నో సినిమాలు చేసిన ఆయనకు తెలుగులో ఇదే మొదటి చిత్రం. ప్రస్తుతం ఆయన గోపీచంద్ చిత్రంలో నటిస్తున్నాడు. -
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్తీస్గఢ్లో ఇతడిని ప్రత్యేక దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది. అంతకుముందు సాహిల్ వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ని బాంబే హైకోర్టు తిరస్కరించింది. ఇప్పుడీ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఈ బెట్టింగ్ కేసు ఏంటి? సాహిల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? బాలీవుడ్ నటుడిగా సాహిల్ ఖాన్ పరిచయమే. 'స్టైల్', 'ఎక్స్యూజ్ మీ' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఫిట్నెస్ ట్రైనర్, ఇన్ఫ్లూయెన్సర్గా చేస్తున్నాడు. కొన్నేళ్ల ముందు మహేదేవ్ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశాడు. అయితే ఈ యాప్ ద్వారా రూ.15,000 కోట్ల అవినీతి జరిగింది. దాదాపు 67 బెట్టింగ్ సైట్లు సృష్టించారు. ఈ విషయమై సామాజిక కార్యకర్త ప్రకాశ్ బంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2023 నవంబరులో మాతుంగ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా డిసెంబరులో దీన్ని ప్రమోట్ చేస్తున్న సాహిల్ ఖాన్కి నోటీసులు జారీ చేశారు.(ఇదీ చదవండి: కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్)అయితే విచారణకు హాజరు కాకుండా సాహిల్.. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టుని ఆశ్రయించాడు. సెలబ్రిటీగా తాను కేవలం ప్రమోట్ చేశానని చెప్పుకొచ్చాడు. యాప్లో జరిగే వాటితో తనకు సంబంధం లేదని పేర్కొన్నాడు. కానీ పోలీసులు మాత్రమే ఇతడిని బెట్టింగ్ యాప్ కో-ఓనర్ అని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు.అయితే ఈ బెట్టింగ్ యాప్ ద్వారా అవినీతి జరిగిన డబ్బంతా కూడా హవాలా ద్వారా విదేశాలకు తరలించినట్లు పోలీసులు గుర్తించారు. సాహిల్తో పాటు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలని కూడా పోలీసులు ఈ కేసులో విచారించే అవకాశాలు ఉన్నాయి.(ఇదీ చదవండి: ప్రముఖ దేవాలయంలో స్టార్ హీరోయిన్ సంయుక్త.. కారణం అదేనా?) -
నేను వాటితో నటించాలంటే కాస్త రెమ్యునరేషన్ పెంచాల్సిందే: ట్రెండింగ్ హీరోయిన్
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ నటించిన చిత్రం 'ప్రసన్న వదనం'. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అర్జున్ వైకే దర్శకత్వం వహించిన ఈ మూవీలో సుహాస్కు జోడీగా కన్నడ బ్యూటీ పాయల్ రాధాకృష్ణ ఎంట్రీ ఇచ్చింది. ట్రైలర్లో ఈ బ్యూటీని చూసిన వారందరూ ఫిదా అవుతున్నారు. దీంతో మే 3న విడుదల కానున్న ప్రసన్న వదనం చిత్రం కోసం ప్రేక్షకులు మరింత ఈగర్గా ఎదురుచూస్తున్నారు.మంగళూరులో పుట్టిన పాయల్ రాధాకృష్ణ మోడల్గా ఎంట్రీ ఇచ్చి ఆపై 'బెంగళూరు అండర్ వరల్డ్' సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. బెంగళూరులో ఇంజినీరింగ్ చేరిన పాయల్ మొదటి సంవత్సరంలోనే చదువు ఆపేసి మోడలింగ్ వైపు అడుగులు వేసింది. అనంతరం అమెజాన్, సఫోలా వంటి ప్రముఖ బ్రాండ్ల కోసం ఆమె పనిచేసింది. తల్లిదండ్రులకు ఇష్టం లేకున్నా యాక్టింగ్లో డిప్లొమా చేసిన ఈ బ్యూటీ 19 ఏళ్లకే సినిమా అవకాశాలపై కన్నేసింది. తల్లి క్లాసికల్ డ్యాన్సర్ కావడంతో పాయల్ రాధాకృష్ణ కూడా మంచి ట్రెడిషినల్ డ్సాన్సర్. ఆమె అమ్మగారు డ్యాన్స్ అకాడమీని కూడా రన్ చేస్తున్నారు.మిగతా హీరోయిన్లకు భిన్నంగా తన ఆలోచనలు ఉన్న పాయలకు పెంపుడు జంతువులు అంటే ఏ మాత్రం ఇష్టం లేదట. ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు ఎక్కువగా కుక్కలు,పిల్లులు పెంచుకుంటూ ఉంటారు. కానీ ఈ కన్నడ బ్యూటీకి పెట్స్ అంటే ఏమాత్రం ఇష్టం లేదని చెప్పింది. తనకు సంబంధించిన యాడ్స్ , సినిమాల్లో పెంపుడు జంతువులతో ఏదైనా సీన్ చేయాలంటే అందుకు రెమ్యునరేషన్ ఎక్కువగా అడుగుతానని ఈ బ్యూటీ చెప్పుకొస్తుంది.సినిమా ఇండస్ట్రీలో మొదట్లో తనకు తెలుగు భాష అంటే కాస్త ఇబ్బందిగా ఉండేదని చెప్పింది. పలు యాడ్లు చేస్తున్నప్పుడు తను తెలుగు మాట్లాడుతుంటే కొందరు కామెంట్లు కూడా చేశారని చెప్పుకొచ్చింది. దీంతో కష్టపడి తెలుగు నేర్చుకున్నానని ఆమె తెలిపింది. టాలీవుడ్లో అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబుతో ఒక సినిమాలో అయినా నటించాలనేది తన కోరిక అంటూ తెలిపింది. కోలీవుడ్లో అయితే ధనుష్తో నటించాలని ఉందని పేర్కొంది. ప్రసన్న వదనం చిత్రంతో పాటు 'చారీ పాఠం' అనే మరో సినిమాలోనూ పాయల్ రాధాకృష్ణ నటిస్తోంది. View this post on Instagram A post shared by Payal Radhakrishna Shenoy (@payal_radhakrishna) -
కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్
మరో కమెడియన్ సొంతిల్లు కట్టుకున్నాడు. 'పటాస్' షోతో గుర్తింపు తెచ్చుకుని.. ఆ తర్వాత పలు కామెడీ షోలతో గుర్తింపు తెచ్చుకున్న గల్లీ బాయ్ భాస్కర్ తాజాగా కొత్త ఇంట్లో అడుగుపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఫైనల్లీ డ్రీమ్ హౌస్ కట్టుకున్నానని ఇన్ స్టాలో రాసుకొచ్చాడు. ఈ కార్యక్రమానికి తోటి కమెడియన్స్ వచ్చి విషెస్ చెప్పారు.(ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?)'పటాస్' షోలో స్టాండప్ కమెడియన్గా కెరీర్ ప్రారంభించిన భాస్కర్.. సద్దాం, యాదమ్మ రాజు తదితరులతో కలిసి స్కిట్స్ కూడా చేసేవాడు. ఆ తర్వాత అదిరింది, కామెడీ స్టార్స్, కామెడీ స్టాక్ ఎక్సేంజ్ లాంటి షోలు చేశాడు. ఇప్పుడు 'జబర్దస్త్'లో చేస్తున్నాడు. వీటితో పాటు ఈవెంట్స్ లో పాల్గొంటూ రెండు చేతులా సంపాదిస్తున్న భాస్కర్.. ఇప్పుడు మూడు అంతస్థుల ఇల్లు కట్టేసుకున్నారు. ఈ వీడియోని పోస్ట్ చేస్తూ.. తన డ్రీమ్ హౌస్ కట్టుకున్నానని ఎమోషనల్ అయ్యాడు.(ఇదీ చదవండి: ప్రముఖ దేవాలయంలో స్టార్ హీరోయిన్ సంయుక్త.. కారణం అదేనా?) View this post on Instagram A post shared by Bhaskar (@gully_boy_bhaskar) -
డైరెక్టర్గా ధన్రాజ్ కొత్త సినిమా.. టీజర్ విడుదల
టాలీవుడ్లో చిన్న చిన్న పాత్రల నుంచి హాస్యనటుడిగా ఎదిగి ఆ తరువాత కథానాయకుడి స్థాయికి చేరిన నటుడు ధన్రాజ్. ఈయన తాజాగా దర్శకుడిగా అవతారమెత్తి కథానాయకుడిగా నటించిన చిత్రం 'రామన్ రాఘవన్'. నటుడు సముద్రఖని ప్రధాన పాత్రను పోషించిన ఈ చిత్రం ద్వారా మోక్ష అనే నటి కథానాయకిగా పరిచయం అవుతున్నారు. స్టేట్ పెన్సిల్ ప్రొడక్షన్స్ పతాకంపై పృధ్వీ పోలవరపు నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళం భాషల్లో రూపొందింది. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ సందర్భం తాజాగా చిత్రం టీజర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలోని ప్రసాద్ల్యాబ్లో నిర్వహించారు. ఇందులో దర్శకుడు బాలా, పాండిరాజ్, నటుడు బాబీసింహ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని టీజర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు, కథానాయకుడు ధన్రాజ్ మాట్లాడుతూ.. అమ్మానాన్నలకు ధన్యవాదాలన్నారు. శివప్రసాద్ రాసిన కథతో రూపొందించిన చిత్రం రామన్ రాఘవన్ అని తెలిపారు. తాను ఈ చిత్రానికి యాక్సిడెంటల్ దర్శకుడినని చెప్పారు. ఏ దర్శకుడి వద్ద పనిచేయలేదని చెప్పారు. వేరే దర్శకుడు చేయాల్సిన ఈ చిత్రానికి తాను అనివార్యకారణాలతో దర్శకుడిని అయ్యానన్నారు. ఈ చిత్రం కథ గురించి సముద్రఖని చెప్పినప్పుడు నువ్వే దర్శకత్వం వహించు అని ధైర్యం ఇచ్చారన్నారు. తాను 100 మంది దర్శకుల చిత్రాల్లో నటించానని, వారి ప్రభావంతోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చెప్పారు. సముద్రఖని లేకపోతే ఈ చిత్రం ఉండేది కాదని ధన్రాజ్ పేర్కొన్నారు. సముద్రఖని మాట్లాడుతూ తాను ఇప్పటివరకూ 10కి పైగా చిత్రాల్లో నాన్నగా నటించానని చెప్పారు. అవి ఒక్కొక్కటి ఒక్కో విధంగా రూపొందాయన్నారు. ఈ చిత్ర దర్శకుడు ధన్రాజ్కు అమ్మా నాన్న లేరని, తనే స్వయం కృషితో ఈ స్థాయికి వచ్చారని పేర్కొన్నారు. నాన్న ఇతి వృత్తంతో కూడిన కథ అని తను చెప్పగానే రండి చేద్దాం అని చెప్పానన్నారు. నమ్మకంతో వచ్చే వాళ్లు చిత్రాన్ని బాగా రూపొందిస్తారని అలా ధన్రాజ్ను నమ్మి తానీ చిత్రం చేశానని చెప్పారు. ఇది తండ్రీ కొడుకుల మధ్య ప్రేమాభిమానాలను ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందని సముద్రఖని చెప్పారు. దర్శకుడు బాలా మాట్లాడుతూ సముద్రఖనికి అభిమానిగా తాను ఇక్కడికి వచ్చానన్నారు. ఆయన నటుడిగా తానేమిటో నిరూపించుకున్నారని, ఆయన శ్రమకు తాను అభిమానినని అన్నారు. ఇతరులకు సహాయం చేసే ఆయన గుణం తనను ఆశ్చర్యానికి గురి చేస్తుందన్నారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నట్లు బాలా పేర్కొన్నారు.
Related News by category
-
ఓటేసేందుకు అమెరికా నుంచి వచ్చిన స్టార్ హీరో కూతురు
ఏప్రిల్ 26న కర్ణాటకలో రెండో దశ ఎన్నికలు జరిగాయి. సామాన్య ప్రజలతో పాటు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొని తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా ప్రజలు తమ గ్రామాలకు చేరుకుని ఓటు వేశారు. ఈ కోవలో కన్నడ టాప్ హీరో దునియా విజయ్ కూతురు మోనిషా కూడా ఉన్నారు.ఇదిలా ఉంటే దునియా విజయ్ కూతురు మోనిషా అమెరికాలోని న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో చదువుతుంది. ఏప్రిల్ 26న ఎన్నికలు ఉండటంతో తన ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు ఆమెరికా నుంచి బెంగళూరుకు చేరుకుంది. తండ్రి మాదిరి మోనిషా కూడా సినిమా రంగంలో రాణించాలని కోరుకుంటుంది. ఈ విషయంపై ఆమె ఇలా చెప్పింది. 'నేనూ, మా చెల్లి మోనికా ఇద్దరమూ సినిమా రంగంపై ఆసక్తి చూపుతున్నాం. నాన్నకు మొదట నచ్చలేదు. సినిమాల్లోకి వద్దని ఆయన చెప్పారు. కానీ, నా సీరియస్నెస్ చూసి ఒప్పుకున్నారు.సినిమా ఇండస్ట్రీకి వస్తే సరైన శిక్షణ తీసుకోవాలని నాన్న గారు సూచించారు. నటనతో పాటు సినిమాల్లోని వివిధ దశలు, సాంకేతికత, మీడియాను ఎలా ఎదుర్కోవాలి, నన్ను నేను ఎలా రక్షించుకోవాలి.. ఇలా అన్నీ సరిగ్గా నేర్చుకుని రావాలని నాన్న సూచించారు. దీంతో న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో నన్ను చేర్పించారు. ప్రస్తుతం అక్కడే చదువుకుంటున్నాను. కోర్సు పూర్తయ్యాక శాండల్ వుడ్కి తప్పకుండా వస్తాను.' అని చెప్పింది మోనిషా.బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం వీరసింహారెడ్డి. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు దునియా విజయ్. కన్నడలో ఎన్నో సినిమాలు చేసిన ఆయనకు తెలుగులో ఇదే మొదటి చిత్రం. ప్రస్తుతం ఆయన గోపీచంద్ చిత్రంలో నటిస్తున్నాడు. -
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్తీస్గఢ్లో ఇతడిని ప్రత్యేక దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది. అంతకుముందు సాహిల్ వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ని బాంబే హైకోర్టు తిరస్కరించింది. ఇప్పుడీ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఈ బెట్టింగ్ కేసు ఏంటి? సాహిల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? బాలీవుడ్ నటుడిగా సాహిల్ ఖాన్ పరిచయమే. 'స్టైల్', 'ఎక్స్యూజ్ మీ' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఫిట్నెస్ ట్రైనర్, ఇన్ఫ్లూయెన్సర్గా చేస్తున్నాడు. కొన్నేళ్ల ముందు మహేదేవ్ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశాడు. అయితే ఈ యాప్ ద్వారా రూ.15,000 కోట్ల అవినీతి జరిగింది. దాదాపు 67 బెట్టింగ్ సైట్లు సృష్టించారు. ఈ విషయమై సామాజిక కార్యకర్త ప్రకాశ్ బంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2023 నవంబరులో మాతుంగ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా డిసెంబరులో దీన్ని ప్రమోట్ చేస్తున్న సాహిల్ ఖాన్కి నోటీసులు జారీ చేశారు.(ఇదీ చదవండి: కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్)అయితే విచారణకు హాజరు కాకుండా సాహిల్.. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టుని ఆశ్రయించాడు. సెలబ్రిటీగా తాను కేవలం ప్రమోట్ చేశానని చెప్పుకొచ్చాడు. యాప్లో జరిగే వాటితో తనకు సంబంధం లేదని పేర్కొన్నాడు. కానీ పోలీసులు మాత్రమే ఇతడిని బెట్టింగ్ యాప్ కో-ఓనర్ అని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు.అయితే ఈ బెట్టింగ్ యాప్ ద్వారా అవినీతి జరిగిన డబ్బంతా కూడా హవాలా ద్వారా విదేశాలకు తరలించినట్లు పోలీసులు గుర్తించారు. సాహిల్తో పాటు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలని కూడా పోలీసులు ఈ కేసులో విచారించే అవకాశాలు ఉన్నాయి.(ఇదీ చదవండి: ప్రముఖ దేవాలయంలో స్టార్ హీరోయిన్ సంయుక్త.. కారణం అదేనా?) -
నేను వాటితో నటించాలంటే కాస్త రెమ్యునరేషన్ పెంచాల్సిందే: ట్రెండింగ్ హీరోయిన్
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ నటించిన చిత్రం 'ప్రసన్న వదనం'. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అర్జున్ వైకే దర్శకత్వం వహించిన ఈ మూవీలో సుహాస్కు జోడీగా కన్నడ బ్యూటీ పాయల్ రాధాకృష్ణ ఎంట్రీ ఇచ్చింది. ట్రైలర్లో ఈ బ్యూటీని చూసిన వారందరూ ఫిదా అవుతున్నారు. దీంతో మే 3న విడుదల కానున్న ప్రసన్న వదనం చిత్రం కోసం ప్రేక్షకులు మరింత ఈగర్గా ఎదురుచూస్తున్నారు.మంగళూరులో పుట్టిన పాయల్ రాధాకృష్ణ మోడల్గా ఎంట్రీ ఇచ్చి ఆపై 'బెంగళూరు అండర్ వరల్డ్' సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. బెంగళూరులో ఇంజినీరింగ్ చేరిన పాయల్ మొదటి సంవత్సరంలోనే చదువు ఆపేసి మోడలింగ్ వైపు అడుగులు వేసింది. అనంతరం అమెజాన్, సఫోలా వంటి ప్రముఖ బ్రాండ్ల కోసం ఆమె పనిచేసింది. తల్లిదండ్రులకు ఇష్టం లేకున్నా యాక్టింగ్లో డిప్లొమా చేసిన ఈ బ్యూటీ 19 ఏళ్లకే సినిమా అవకాశాలపై కన్నేసింది. తల్లి క్లాసికల్ డ్యాన్సర్ కావడంతో పాయల్ రాధాకృష్ణ కూడా మంచి ట్రెడిషినల్ డ్సాన్సర్. ఆమె అమ్మగారు డ్యాన్స్ అకాడమీని కూడా రన్ చేస్తున్నారు.మిగతా హీరోయిన్లకు భిన్నంగా తన ఆలోచనలు ఉన్న పాయలకు పెంపుడు జంతువులు అంటే ఏ మాత్రం ఇష్టం లేదట. ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు ఎక్కువగా కుక్కలు,పిల్లులు పెంచుకుంటూ ఉంటారు. కానీ ఈ కన్నడ బ్యూటీకి పెట్స్ అంటే ఏమాత్రం ఇష్టం లేదని చెప్పింది. తనకు సంబంధించిన యాడ్స్ , సినిమాల్లో పెంపుడు జంతువులతో ఏదైనా సీన్ చేయాలంటే అందుకు రెమ్యునరేషన్ ఎక్కువగా అడుగుతానని ఈ బ్యూటీ చెప్పుకొస్తుంది.సినిమా ఇండస్ట్రీలో మొదట్లో తనకు తెలుగు భాష అంటే కాస్త ఇబ్బందిగా ఉండేదని చెప్పింది. పలు యాడ్లు చేస్తున్నప్పుడు తను తెలుగు మాట్లాడుతుంటే కొందరు కామెంట్లు కూడా చేశారని చెప్పుకొచ్చింది. దీంతో కష్టపడి తెలుగు నేర్చుకున్నానని ఆమె తెలిపింది. టాలీవుడ్లో అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబుతో ఒక సినిమాలో అయినా నటించాలనేది తన కోరిక అంటూ తెలిపింది. కోలీవుడ్లో అయితే ధనుష్తో నటించాలని ఉందని పేర్కొంది. ప్రసన్న వదనం చిత్రంతో పాటు 'చారీ పాఠం' అనే మరో సినిమాలోనూ పాయల్ రాధాకృష్ణ నటిస్తోంది. View this post on Instagram A post shared by Payal Radhakrishna Shenoy (@payal_radhakrishna) -
Nidhi Bhist: మెయిన్ రోల్స్.. ప్చ్.. కష్టమే..! కానీ ఇప్పుడు నిధి ద బెస్ట్!!
‘జాబ్ కన్నా యాక్టింగ్ మీద ప్యాషన్ ఉన్నట్టుంది. షారూఖ్ ఖాన్తో కలసి స్క్రీన్ మీద కనిపిస్తావన్నమాట’ అంటూ బాస్ ఎగతాళి చేశాడు. ‘గుండ్రటి మొహం.. అక్క, వదిన, పిన్ని పాత్రలకైతే పనికొస్తావ్. మెయిన్ రోల్స్.. ప్చ్.. కష్టమే!’ అని బాలీవుడ్ రిజెక్ట్ చేసింది. ఆమె ఇప్పుడు వండర్ఫుల్ యాక్ట్రెస్, రైటర్ అండ్ డైరెక్టర్గా సినిమా ప్రేక్షకుల, వెబ్ వీక్షకుల మన్ననలందుకుంటోంది. అన్నట్టు షారూఖ్ ఖాన్తోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆ బహుముఖ ప్రజ్ఞ పేరు.. నిధి బిష్ట్! ► ఢిల్లీలో పుట్టి, పెరిగింది. అమ్మ.. టీచర్. నాన్న.. ఐపీఎస్ ఆఫీసర్. ఆ ఇద్దరూ తమ కూతురు డాక్టర్ కావాలని కలలు కన్నారు. వాళ్ల కోరిక మేరకు ఇంటర్లో బైపీసీలో జాయిన్ అయింది నిధి. కానీ రెండు రోజులకే అది తన నోట్స్ ఆఫ్ స్టడీ కాదనుకుంది. దాంతో కామర్స్ గ్రూప్కి మారింది. అదీ తనకు సరిపడదని గ్రహించి ఆ వెంటనే హ్యుమానిటీస్లోకి వెళ్లి సెట్ అయింది.► ఇంటర్ తర్వాత .. జామియా మిలియా యూనివర్సిటీలో లా చేసింది. అక్కడ థియేటర్ వింగ్ ఇప్టా (ఇండియన్ పీపుల్ థియేటర్ అసోసియేషన్) చాలా యాక్టివ్. చిన్నప్పటి నుంచీ నిధికి నటనంటే ప్రాణం. అందుకే ‘లా’ కోసం ఆ యూనివర్సిటీని ఎంచుకుంది. తన అయిదేళ్ల లా కోర్స్లో ఇప్టాతోనే ఎక్కువ గడపింది నాటకాలు రాస్తూ.. వేస్తూ! ఆ ఆసక్తి, ఉత్సాహంతోనే లా అయిపోగానే పుణె వెళ్లింది అక్కడి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవడానికి. కానీ అందులో సీట్ రాలేదు. నిరాశతో మళ్లీ ఢిల్లీకి వచ్చేసి ఒక లా ఫర్మ్లో చేరింది.► ఉద్యోగం చేస్తున్నప్పుడే ఒక నాటకంలో నటించే అవకాశం వచ్చింది నిధికి. ఉదయం 9 కల్లా ఆఫీస్కి చేరి.. అక్కడి నుంచి కోర్ట్.. మళ్లీ ఆఫీస్ అలా రాత్రి 9 వరకు పని చూసుకుని.. అక్కడి నుంచి నేరుగా థియేటర్ రిహార్సల్స్కి వెళ్లేదట. ఉదయం మూడు గంటల వరకు రిహార్సల్స్ చూసుకుని ఇల్లు చేరేది. అలా కొన్ని నెలల శ్రమానంతరం స్టేజ్ మీద నాటకం ప్రదర్శించే రోజు రానేవచ్చింది. నిధి తన బాస్నూ ఆహ్వానించింది. అతను ఆ రోజు చప్పట్లతో ఆమె ప్రతిభను ప్రశంసించాడు. కానీ మరుసటి రోజు ఆఫీస్లో పది పనులు చెప్పి .. సాయంకాలానికి డెడ్లైన్ ఇచ్చాడు. చేయలేకపోయింది నిధి. అప్పుడే ‘షారూఖ్ ఖాన్తో కలసి కనిపిస్తావన్నమాట’ అంటూ ఆ బాస్ కామెంట్ చేశాడు. ‘తప్పకుండా కనిపిస్తాను చూడండీ..’ అంటూ ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి బయటకు వచ్చింది నిధి.► యాక్టింగ్ మీదే పూర్తి దృష్టి పెట్టాలని ముంబై చేరింది. కనీస అవసరాల కోసం p్చnజ్ఛ్చ3 అనే లీగల్ ఔట్సోర్సింగ్ సంస్థలో చేరింది. జాబ్.. ఆడిషన్సే లోకమయ్యాయి ఆమెకు. అయితే ఎక్కడికి వెళ్లినా రిజెక్షనే ఎదురైంది. అయినా అధైర్యపడలేదు. తన ఫిక్స్డ్ డిపాజిట్ని బ్రేక్ చేసి ‘న్యూ బ్రెయిన్ థియేటర్ వోక్స్’ అనే బ్యానర్ని స్థాపించి ‘హూ లెట్ ద డాగ్స్ అవుట్’ అనే నాటకాన్ని డైరెక్ట్ చేసింది. అది చూసి యూట్యూబ్ చానెల్ ‘టీవీఎఫ్ (ద వైరల్ ఫీవర్ ) వీడియోస్’ ఫౌండర్ అరునాబ్ కుమార్ టీవీఎఫ్లో అవకాశం ఇచ్చాడు. అందులో ఆమె స్క్రిప్ట్ రైటర్గా, యాక్టర్గా, కాస్టింగ్ డైరెక్టర్గా మల్టిపుల్ రోల్స్ని పోషించింది. ఆ టాలెంట్ ఆమెకు ఇటు ఓటీటీ.. అటు సినిమాల్లో ఎన్నో అవకాశాలను తెచ్చిపెట్టింది. దేశమంతటా అభిమానాన్ని సంపాదించిపెట్టింది.► క్రియెటివిటీకి బెంచ్ మార్క్ ఉండదనే కాన్ఫిడెన్స్ నాది. కాబట్టే ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా లైట్ తీసుకున్నా. వచ్చిన అవకాశంతో నేనేంటో నిరూపించుకున్నా! అందుకే ఆ రోజు రిజెక్ట్ చేసినవాళ్లే ఈ రోజు నాతో పనిచేయడానికి డేట్స్ అడుగుతున్నారు!‘తుప్పాకీ’, ‘చాయ్ సుట్టా క్రానికల్స్’, ‘పర్మినెంట్ రూమ్మేట్స్’, ‘టీవీఎఫ్ పిచర్స్’, ‘ఉమ్రీకా’, ‘టీవీఎఫ్ ట్రిప్లింగ్’, ‘ఫిల్లోరి’, ‘బిష్ట్.. ప్లీజ్’, ‘పిఏ గాళ్స్’, ‘డ్రీమ్ గర్ల్’, ‘క్యూబికల్స్’, ‘మిస్టర్ అండ్ మిసెస్’, ç‘ßోమ్ శాంతి’, ‘ఫోన్ బూత్’. ‘మామ్లా లీగల్ హై’ వంటి షోస్, సినిమాస్, సిరీస్కి కాస్టింగ్ డైరెక్టర్, రైటర్, డెరెక్టర్, యాక్టర్గా పనిచేసింది. టీవీఎఫ్లోనే.. షారూఖ్ ఖాన్ పాల్గొన్న ‘బేర్లీ స్పీకింగ్ విత్ అర్నబ్’ అనే షోకి నిధి మోడరేటర్గా వ్యవహరించి.. తన బాస్కి చెప్పినట్టు షారూఖ్ ఖాన్తో స్క్రీన్ కూడా షేర్ చేసుకుంది. – నిధి బిష్ట్.ఇవి చదవండి: Cover Story: 'స్వేదవేదం'! చెమటచుక్కకు దక్కుతున్నదెంత? -
కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్
మరో కమెడియన్ సొంతిల్లు కట్టుకున్నాడు. 'పటాస్' షోతో గుర్తింపు తెచ్చుకుని.. ఆ తర్వాత పలు కామెడీ షోలతో గుర్తింపు తెచ్చుకున్న గల్లీ బాయ్ భాస్కర్ తాజాగా కొత్త ఇంట్లో అడుగుపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఫైనల్లీ డ్రీమ్ హౌస్ కట్టుకున్నానని ఇన్ స్టాలో రాసుకొచ్చాడు. ఈ కార్యక్రమానికి తోటి కమెడియన్స్ వచ్చి విషెస్ చెప్పారు.(ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?)'పటాస్' షోలో స్టాండప్ కమెడియన్గా కెరీర్ ప్రారంభించిన భాస్కర్.. సద్దాం, యాదమ్మ రాజు తదితరులతో కలిసి స్కిట్స్ కూడా చేసేవాడు. ఆ తర్వాత అదిరింది, కామెడీ స్టార్స్, కామెడీ స్టాక్ ఎక్సేంజ్ లాంటి షోలు చేశాడు. ఇప్పుడు 'జబర్దస్త్'లో చేస్తున్నాడు. వీటితో పాటు ఈవెంట్స్ లో పాల్గొంటూ రెండు చేతులా సంపాదిస్తున్న భాస్కర్.. ఇప్పుడు మూడు అంతస్థుల ఇల్లు కట్టేసుకున్నారు. ఈ వీడియోని పోస్ట్ చేస్తూ.. తన డ్రీమ్ హౌస్ కట్టుకున్నానని ఎమోషనల్ అయ్యాడు.(ఇదీ చదవండి: ప్రముఖ దేవాలయంలో స్టార్ హీరోయిన్ సంయుక్త.. కారణం అదేనా?) View this post on Instagram A post shared by Bhaskar (@gully_boy_bhaskar)
Advertisement
Photos
View allVideo
View allఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- Rishabh Pant: భారీ ప్రమాదం నుంచి మైదానం వరకు..
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement