No Headline
కోవెలకుంట్ల: 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎన్ని అడ్డదారులు తొక్కి అయినా గెలవాలన్న ఉద్ధేశం ఓటర్లను మభ్య పెట్టేందుకు ఉచిత హామీలు గుప్పిస్తున్నారు. బనగానపల్లె నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి బీసీ జనార్ధన్రెడ్డి ఎన్నికల వేళ ఓటర్లకు ఇళ్లస్థలాల పేరుతో గాలం వేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే రెండు సెంట్ల స్థలాన్ని అందజేస్తామని కల్లిబొల్లిమాటలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నియోజకవర్గంలోని కోవెలకుంట్ల, సంజామల, అవుకు, కొలిమిగుండ్ల, బనగానపల్లె మండలాల్లోని ఆయా గ్రామాల్లో 12,136 మందికి ఇళ్లస్థలాలు మంజూరు చేసింది. పేదలకు సొంతింటి కల నెరవేర్చాలన్న ఉద్ధేఽశం ఆయా మండలాల్లో ఇళ్లు లేని నిరుపేదలను గుర్తించి ఇంటి స్థలంతోపాటు పక్కా హాలు మంజూరు చేసింది. కోవెలకుంట్ల మండలంలో 2,234 మందికి, కొలిమిగుండ్లలో 1,999 మందికి, సంజామల మండలంలో 1,530 మందికి, అవుకు మండలంలో వెయ్యి మందికి, బనగానపల్లె మండలంలో 5,373 మందికి ఇళ్ల స్థలాలు మంజూరయ్యాయి. ప్రభుత్వ స్థలాలు అందుబాటులోని లేని గ్రామాల్లో ప్రైవేట్ భూములను ఎకరా రూ. 20 లక్షల నుంచి రూ. 25 లక్షలతో కొనుగోలు చేసి ఇళ్లస్థలాలు పంపిణీ చేసింది. ఆయా గ్రామాల్లో జగనన్న కాలనీల్లో నిర్మించిన ఇళ్లు ఊర్లను తలపిస్తున్నాయి.
బనగానపల్లెలో అడ్డుకున్న బీసీ
వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదలకు ఇళ్లస్థలాలతో పక్కాగృహాలు మంజూరు చేయగా టీడీపీ అభ్యర్థి బీసీ జనార్ధన్రెడ్డి ఇళ్లస్థలాల పంపిణీకి మోకాలొడ్డాడు. బనగానపల్లె మేజర్ గ్రామ పంచాయతీలో 3,200 మందికి ఇళ్ల స్థలాలు కేటాయించగా లబ్దిదారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వవద్దని బీసీ కోర్టును ఆశ్రయించారు. 2020 డిసెంబర్ 25వ తేదీన నియోజకవర్గంలోని మిగిలిన మండలాల్లో ఇళ్లస్థలాలు పంపిణీ చేయగా బీసీ జనార్ధన్రెడ్డి కుట్రతో బనగానపల్లె పట్టణంలో ఇళ్లస్థలాల పంపిణీకి బ్రేక్ పడింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇళ్లస్థలాలు ఇవ్వడంతో పాటు పక్కాగృహ నిర్మాణానికి రూ. 1.80 లక్షల నిధులు మంజూరు చేసింది. 20 టన్నుల ఇసుక ఉచితంగా సరఫరా చేయడంతోపాటు రాయితీపై సిమెంట్, కడ్డీలు, కిటీకీలు, వాకిళ్లు, తదితర ఇంటి నిర్మాణ సామగ్రిని అందజేయడంతో పాటు మూడు విడతల్లో గృహ నిర్మాణ బిల్లులు చెల్లించింది. బనగానపల్లె పట్టణంలో మాత్రం బీసీ పుణ్యమా అంటూ లబ్ధిదారులు ఇళ్లస్థలాలకు నోచుకోలేదు. అలాగే 2014 సార్వత్రిక ఎన్నికల్లో కూడా కోవెలకుంట్ల మేజర్ గ్రామ పంచాయతీలో 200 మంది టైలర్లకు ఉచితంగా ఇళ్లస్థలాలు ఇస్తామని చెప్పి ఆ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాగానే ఒక్క సెంటు స్థలం ఇవ్వకుండా టైలర్లను మోసం చేశాడు.
పేదలకు అనుకూలంగా తీర్పు
బనగానపల్లె పట్టణంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా బీసీ జనార్థన్రెడ్డి అడ్డుకోగా సొంతిల్లు లేని పేదల కష్టాలను గుర్తించిన ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కోర్టు ద్వారా పోరాడారు. చివరకు అర్హులైన పేదలకు ఇళ్లస్థలాలు పంపిణీ చేయాలని ఇటీవల కోర్టు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు ఆస్కారం లేదు. ఇళ్లస్థలాలు పంపిణీ చేయకుండా ఐదేళ్లపాటు అడ్డుకున్న బీసీ ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో ఓట్ల కోసం పేదలకు రెండుసెంట్ల స్థలాన్ని ఇస్తామని చెబుతుండటాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం కేటాయించిన ఇళ్లస్థలాలు ఇవ్వకుండా అడ్డుకున్న వ్యక్తి ఓట్ల కోసం ఇళ్లస్థలాల అంశాన్ని తెరపైకి తెచ్చాడని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదలందరికి ఇంటిస్థలం, పక్కాగృహాలు నిర్మించి సొంతింటి కల నేరవేర్చింది. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటిస్థలం, పక్కాగృహం మంజూరు చేసి అందరికీ న్యాయం చేసింది. 2024 ఎన్నికల్లో ఇళ్లస్థలాల హామీని ఎరగా వేసి లబ్ధి పొందాలని బీసీ కుయుక్తులు పడుతున్నారు. టీడీపీ అభ్యర్థి ఇళ్లస్థలాల మాయను ఎటువంటి పరిస్థితుల్లో నమ్మబోమని ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారు. బీసీ ‘గూడు’ పుఠాణిఓట్ల కోసం టీడీపీ అభ్యర్థి బీసీ జనార్ధన్రెడ్డి కుయుక్తులు
మొన్న కోవెలకుంట్లలో ఇళ్లస్థలాల
పేరుతో టైలర్లకు టోకరా
నిన్న బనగానపల్లెలో ఇళ్లస్థలాలు
ఇవ్వకుండా అడ్డుకున్న ఘనుడు
నేడు రెండు సెంట్ల స్థలం
ఇస్తామంటూ గాలం