క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లిన రైతులు | Sakshi
Sakshi News home page

Published Mon, Feb 27 2023 7:38 AM

-

భూపాలపల్లి రూరల్‌: జిల్లాలోని వివిధ మండలాల నుంచి 320మంది రైతులను ఉద్యానవన శాఖ జిల్లా అధికారి సంజీవరావు ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట ఆయిల్‌పామ్‌ తోటల క్షేత్ర పర్యటనకు తీసుకెళ్లారు. ఆదివారం జిల్లాకేంద్రంలో యాత్రకు సంబంధించిన బస్సులను సువెన్‌ అగ్రి ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గండ్ర గౌతమ్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉద్యానశాఖ జిల్లా అధికారి సంజీవరావు మాట్లాడారు. అశ్వరావుపేటలో ఆయిల్‌పామ్‌ సాగును రైతులకు చూపించనున్నట్లు తెలిపారు. అక్కడి అధికారులతో పాటు అనుభవం ఉన్న రైతులతో తోటల పెంపకం, లాభాలపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డివిజన్‌ ఉద్యానశాఖ అధికారి సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement