అపరిచితులను గోదావరి దాటించొద్దు | Sakshi
Sakshi News home page

అపరిచితులను గోదావరి దాటించొద్దు

Published Thu, Nov 9 2023 1:52 AM

బార్డర్‌ చెక్‌పోస్టును తనిఖీ చేస్తున్న డీఎస్పీ    - Sakshi

కాళేశ్వరం: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అపరిచిత వ్యక్తులను నాటుపడవల్లో గోదావరి దాటించొద్దని ఎస్సై లక్ష్మణ్‌రావు జాలర్లను హెచ్చరించారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలూకాలోని మండలపురంకు చెందిన చేపలు పట్టె జాలర్లతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాత్రి సమయాల్లో నాటు పడవల్లో అపరిచిత వ్యక్తులు గోదావరి దాటించరాదని పేర్కొన్నారు. ఒక వేళ అపరిచితులు కనిపిస్తే సమాచారం అందించాలన్నారు. అక్కడి జాలర్ల వివరాలను తీసుకున్నారు. అనంతరం కాటారం డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి కాళేశ్వరం సమీపంలోని అంతర్రాష్ట వంతెన వద్ద ఏర్పాటు చేసిన బార్డర్‌ చెక్‌పోస్టును తనిఖీ చేశారు. పోలీసు అధికారులకు సలహాలు, సూచనలు అందజేశారు. ఆయన వెంట పోలీసులు ఉన్నారు.

జాలర్లతో మాట్లాడుతున్న ఎస్సై లక్ష్మణ్‌రావు
1/1

జాలర్లతో మాట్లాడుతున్న ఎస్సై లక్ష్మణ్‌రావు

Advertisement

తప్పక చదవండి

Advertisement