వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి | Sakshi
Sakshi News home page

వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి

Published Fri, Nov 10 2023 5:06 AM

-

మల్హర్‌: ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని డీఎంహెచ్‌ఓ చల్ల మధుసూదన్‌ అన్నారు. మండలంలోని తాడిచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌ఓ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ, సిబ్బంది, పార్మసీ రిజిస్టర్లు పరిశీలించారు. అనంతరం సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించి సూచనలు చేశారు. పీహెచ్‌సీకి వచ్చే బాధితులకు బాధ్యతగా వైద్యసేవలు అందించి భరోసా కల్పించాలన్నారు. వైద్య సిబ్బంది విధిగా సమయానికి విధులకు హాజరు కావాలని ఆదేశించారు. ఓపీ సేవలు మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఆరోగ్య కార్యకర్తలు చేసే సేవలు, పనులు రోజువారీగా నమోదు చేసేలా చూడాలని వివరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement