ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి | Sakshi
Sakshi News home page

ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి

Published Sun, Nov 19 2023 1:16 AM

-

మల్హర్‌: ఈనెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కాటారం డీఎస్పీ రాంమోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని కొండంపేట గ్రామంలో పోలింగ్‌ బూత్‌లను డీఎస్పీ శనివారం పరిశీలించారు. అనంతరం గ్రామస్తులకు సమావేశం నిర్వహించి ఎన్నికలపై అవగాహన సద స్సు నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రజలంతా సహకరించాలన్నారు. ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పారు. ఎలాంటి ప్రలోభాలకు గురి కావవద్దని సూచించారు. ఎవరైనా చట్ట విరుద్ధంగా ప్రవర్తించినా గొడవలు సృష్టించినా.. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement