తూర్పును గూండాల నుంచి కాపాడాలి : బీజేపీ అభ్యర్థి ప్రదీప్‌రావు | Sakshi
Sakshi News home page

తూర్పును గూండాల నుంచి కాపాడాలి : బీజేపీ అభ్యర్థి ప్రదీప్‌రావు

Published Sun, Nov 19 2023 1:16 AM

- - Sakshi

వరంగల్‌ తూర్పు నియోజకవర్గాన్ని గూండాల రాజ్యం నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్‌ రావు అన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, తూర్పు అభివృద్ధే తన ధ్యేయమని పేర్కొన్నారు. ఆజంజాహి మిల్లును అమ్మి, సెంట్రల్‌ జైలును కుదువపెట్టినందున వరంగల్‌ ప్రజలు, యువతకు ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్య క్తం చేశారు. నగరంలోని డ్రెయినేజీలు, నాలాలు ఆక్రమణకు గురికావడంతో చిన్నపాటి వర్షానికే వీధులన్నీ జలమయమవుతున్నాయన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే డబుల్‌ ఇంజన్‌ సర్కారుతో డబుల్‌ అభివృద్ధి చేయడమే కాకుండా కేంద్రం నుంచి భారీ పరిశ్రమలను తీసుకువస్తామని, యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement