బీఆర్‌ఎస్‌తోనే సంక్షేమ రాజ్యం | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌తోనే సంక్షేమ రాజ్యం

Published Wed, Nov 22 2023 1:38 AM

- - Sakshi

బుధవారం శ్రీ 22 శ్రీ నవంబర్‌ శ్రీ 2023
వేగులతో సమాచార సేకరణ!

పోలింగ్‌ నిర్వహణకు

కట్టుదిట్టమైన చర్యలు

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి

వికాస్‌ రాజ్‌

ములుగు: అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అన్ని రకాలుగా కట్టుదిమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ సూచించారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌ నుంచి జిల్లా జాయింట్‌ ఎన్నికల ప్రధాన అధికారి సర్పరాజ్‌ అహ్మద్‌తో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లా తరఫున ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి, రిటర్నింగ్‌ అధికారి అంకిత్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్‌ రోజు అత్యవసర సేవలు కింద విధులు నిర్వహించే వారు తమ ఓటు హక్కును ముందస్తుగా వినియోగించుకునేందుకు ఎన్నికల కమిషన్‌ అవకాశం కల్పించిందన్నారు. దరఖాస్తు చేసుకున్న ఓటర్ల కోసం రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో ఫెసిలిటేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పోటీ చేసే అభ్యర్థులకు తప్పనిసరిగా ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్ల జాబితా వివరాలను అందజేయాలన్నారు. ఇంటి వద్ద నుంచి ఓటు సేకరణ వివరాలను ప్రతిరోజూ మీడియా ద్వారా తెలియజేయాలన్నారు. నూతన ఓటర్లకు గుర్తింపు కార్డులు పంపిణీ త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్లిప్పుల పంపిణీపై నివేధిక అందించాలన్నారు. పోలింగ్‌ రోజు విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించామన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలో 31,873 ఓటరు గుర్తింపు కార్డులు ముద్రణకు ఆర్డర్‌ పెట్టామని వివరించారు. ఇప్పటి వరకు 20, 573 గుర్తింపు కార్డులను స్వీకరించి ఓటర్లకు అందిస్తున్నామని వెల్లడించారు. మరో రెండు రోజుల్లో 8,759 ఓటరు గుర్తింపు కార్డులు వస్తాయని తెలిపారు. వాటిని సైతం త్వరితగతిన పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు.

ఓటును అమ్ముకోవద్దు

ఏటూరునాగారం: ఓటర్లు తమ ఓటును నోట్లకు అమ్ముకోవద్దని జిల్లా ఎస్‌వీఈఈపీ నోడల్‌ అధికారి, డీడబ్ల్యూఓ ప్రేమలత తెలిపారు. మండల కేంద్రంలోని వైజంక్షన్‌ వద్ద డిగ్రీ కళాశాల విద్యార్థులు, ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లతో మంగళవారం ఓటరు చైతన్య ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రేమలత మాట్లాడుతూ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. నూతనంగా ఓటు హక్కుకు అర్హత సాధించిన యువతీ యువకులు అర్హులైన అభ్యర్థులకు ఓట్లు వేసి నిజాయితీని చాటుకోవాలన్నారు. ఓటుహక్కు చాలా విలువైందని దాన్ని అమ్ముకోవడం సరికాదన్నారు. ఓటర్లు బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. డబ్బులకు ఆశించకుండా అభివృద్ధి చేసే నాయకులను ఎన్నుకోవాలన్నారు. అనంతరం డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులతో పాటుగా ఇంటిచుట్టు పక్కల వారు ఓటును నిజాయతీగా వేసేలా చూడాలని సూచించారు. అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడే భవిష్యత్‌ బాగుంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ చిన్న, జిల్లా ఎన్నికల ఐకాన్‌, పర్వతారోహకుడు వివేక్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారి ఘన్‌సింగ్‌, జిల్లా బాలల ప్రొటెక్షన్‌ అధికారి హరికృష్ణ, సఖి లీగల్‌ అధికారి కర్నే ప్రణయ్‌, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ సూపర్‌వైజర్‌ సుదర్శన్‌, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

చేపల పెంపకాన్ని

ఓడ బలిజలకు అప్పగించాలి

ఏటూరునాగారం: చేప పిల్లల పెంపకాన్ని ఓడ బలిజలకు అప్పగించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు గార ఆనంద్‌ కోరారు. మండల పరిధిలోని రాంనగర్‌లో ఓడబలిజ మత్స్యకార జెండాను మంగళవారం ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేపల వృత్తినే ప్రధానంగా భావించి గోదావరి నది తీర ప్రాంతానికి ఇరువైపులా మత్స్యకార కుటుంబాలు నివసిస్తున్నాయన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ పథకాలు వారికి అందేలా చూడాలన్నారు. గ్రామాల్లో ఉన్న చెరువులు, కుంటలలో చేప పిల్లల ఉత్పత్తిని ప్రభుత్వం ఓడబలిజలకు కేటాయించాలని కోరా రు. విద్యా, ఉద్యోగ అవకాశాల్లో ఓడబలిజలకు రిజర్వేషన్లు కల్పించి అభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఓడబలిజ నాయకులు, కుల పెద్దలు గార లచ్చం, అల్లి అర్జున్‌, గగ్గూరి నాగేశ్వరరావు, అల్లి రాంబాబు, గార నీలం, బొల్లె పెద్దన్న, గార నగేష్‌, తోట నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, ముకుందరావు, బి.మహేందర్‌ పాల్గొన్నారు.

సాక్షి, మహబూబాబాద్‌/ మరిపెడ/ మరిపెడ రూరల్‌: ‘యాడియో.. బాయియో.. బహెనో.. రాం..రాం’ అందరూ బాగుండాలి. మంచి పాలన అందాలంటే తెలంగాణను పోరాడి సాధించుకున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రావాలి. బీఆర్‌ఎస్‌తోనే సంక్షేమ రాజ్యం సాధ్యం’ అని బీఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మహబూబాబాద్‌ జిల్లా మరిపెడలో జరిగిన డోర్నకల్‌ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగించారు. ఏళ్లుగా గిరిజనులు తమ తండాలో తమరాజ్యం కావాలని ఆకాంక్షించారని, గత పాలకులు పట్టించుకోలేదని, బీఆర్‌ఎస్‌ పాలనలో 3500 తండాలను పంచాయతీలుగా ప్రకటించామన్నారు. డోర్నకల్‌ నియోజకర్గంలోని 82 తండాల్లో గిరిజనులే పాలన సాగిస్తున్నారన్నారు. తన గురించి, పైరవీల గురించి ఆలోచించకుండా ప్రజల కోసమే పని చేసే రెడ్యానాయక్‌ వంటి నాయకుడు పాలించడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. సీనియర్‌ నాయకుడిగా ఈ ప్రాంతానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు. నాకు మంచి సలహాదారుడిగా ఉంటున్న రెడ్యానాయక్‌ను మళ్లీ గెలిపించాలని, నూతన ప్రభుత్వంలో మంచి హోదా కల్పించే బాధ్యత నాదని కేసీఆర్‌ ప్రకటించారు.

కురవి వీరభద్రుడు పవర్‌ఫుల్‌..

నియోజకవర్గంలోని కురవి వీరభద్రుడు పవర్‌ఫుల్‌ దేవుడు అని కేసీఆర్‌ అన్నారు. ఉద్యమ సమయంలో వీరన్నకు మొక్కి ముందుకెళ్లానని, తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత బంగారు కోరమీసం చెల్లించి మొక్కులు తీర్చుకున్నానని గుర్తుచేశారు. దేవుడే కాదు.. ఈ ప్రాంత ప్రజలు కూడా మంచి చైతన్యవంతులు అన్నారు. ఇదే చైతన్యంతో మంచి నాయకుడిని ఎన్నుకోవాలని కోరారు.

కాల్వలతో ధాన్యం రాశులు

గత పాలకులు కాల్వలు తవ్వారు. కానీ ఏనాడూ చుక్కనీరు పారించలేదని కేసీఆర్‌ అన్నారు. వెన్నవరం కాల్వకు రెడ్యానాయక్‌, శంకర్‌నాయక్‌ పట్టుపట్టి సాగునీరు వచ్చేలా కృషి చేశారని పేర్కొన్నారు. దీంతో నాడు నీళ్లు లేక కాల్వలను చూస్తే కన్నీరు వచ్చేదని, ఇప్పుడు నిండా పారుతున్న కాల్వలతో ధాన్యపురాశులు పండుతున్నాయని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నిర్మించిన ప్రాజెక్టులతో రాష్ట్రంలో 3కోట్ల టన్నుల ధాన్యం పండుతుందని, సీతారామ, పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటే ధాన్యం ఉత్పత్తి 4కోట్ల టన్నులకు చేరుతుందని వివరించారు. సభలో మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ బిందు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నవీన్‌రావు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, సీనియర్‌ నాయకులు నూకల నరేశ్‌రెడ్డి, రామసహాయం రంగారెడ్డి, నూకల శ్రీరంగారెడ్డి, డీఎస్‌ రవిచంద్ర, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సింధూర, ఎంపీపీ అరుణ, జెడ్పీటీసీ శారద, వేణుగోపాల్‌రెడ్డి, పర్కాల శ్రీనివాస్‌రెడ్డి, ముత్యం వెంకన్న, అయూబ్‌ పాషా, చాపల యాదగిరిరెడ్డి, మహేందర్‌రెడ్డి, కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఉర్రూతలూగించిన గులాబీల జెండలు పాట

ఏపూరి సోమన్న కళా బృందం సభ్యులు పాటలు పాడుతూ సభికులను ఉత్సాహపరిచారు. గులాబీల జెండల పాటకు స్టేజీపై ఉన్న మంత్రి సత్యవతి రాథోడ్‌, మానుకోట ఎంపీ మాలోతు కవిత, మహిళా ప్రజాప్రతినిధులు నృత్యాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సభ ముగియడంతో ప్రజాప్రతినిధులు, పోలీస్‌ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

మళ్లీ గెలిపిస్తే మరింత సేవ చేస్తా:

రెడ్యానాయక్‌

ఇంతకాలం ప్రజల దీవెనలు, ఆశీస్సులతో డోర్నకల్‌ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానని, మళ్లీ గెలిపిస్తే మరింత సేవ చేస్తానని ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి డీఎస్‌ రెడ్యానాయక్‌ అన్నారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహకారంతో మరిపెడలో 100 పడకల ఆస్పత్రిని మంజూరు చేయించుకున్నామని చెప్పారు. మళ్లీ మన ప్రభుత్వం రాగానే మరిపెడ రెవెన్యూ డివిజన్‌, డోర్నకల్‌లో 100 పడకల ఆస్పత్రి, ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేయించుకుందామన్నారు. మాకుల వేంకటేశ్వరస్వామి దేవాలయానికి రూ.5కోట్లు, నియోజకవర్గంలోని దళితులందరికీ దళితబంధు వచ్చేలా కృషి చేస్తానని చెప్పారు.

న్యూస్‌రీల్‌

సీఎం కేసీఆర్‌ సభ సైడ్‌లైట్స్‌

మధ్నాహ్నం 3:30 గంటలకు: సభ ప్రాంగణానికి చేరుకున్న సీఎం హెలికాప్టర్‌.. వేదిక చుట్టూ ఒక రౌండ్‌ చక్కర్లు.

3:37 గంటలకు : హెలికాప్టర్‌ ల్యాండింగ్‌

3:43 గంటలకు : హెలిపాడ్‌ నుంచి బస్సులో వేదిక వద్దకు..

3:49 గంటలకు : సీఎం ప్రసంగం ప్రారంభం

4:09 గంటలకు : ప్రసంగం ముగింపు

4:16 గంటలకు : హెలికాప్టర్‌లో సీఎం సూర్యాపేట వైపు పయనం..

రెడ్యానాయక్‌ సీనియర్‌ నాయకుడు, నాకు మంచి సలహాదారు

మళ్లీ గెలిపిస్తే మంచి హోదా కల్పిస్తా..

గిరిజనుల కోరిక మేరకు తండాలను

గ్రామ పంచాయతీలుగా చేశాం

కాల్వలను చూసి కన్నీరు పెట్టుకున్న

చోటే.. ధాన్యపురాశులు పండుతున్నాయి

ఉద్యమ సమయంలో

వీరన్నకు మొక్కి ముందుకెళ్లా..

రాష్ట్రం సాధించాక స్వామికి

కోరమీసం మొక్కు చెల్లించా

డోర్నకల్‌ నియోజకవర్గ

ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌

సభలో ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్‌, పక్కన అభ్యర్థి రెడ్యానాయక్‌
1/6

సభలో ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్‌, పక్కన అభ్యర్థి రెడ్యానాయక్‌

2/6

వీసీకి హాజరైన జిల్లా ఎన్నికల అధికారి 
ఇలా త్రిపాఠి, రిటర్నింగ్‌ అధికారి అంకిత్‌
3/6

వీసీకి హాజరైన జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి, రిటర్నింగ్‌ అధికారి అంకిత్‌

మరిపెడలో జరిగిన డోర్నకల్‌ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన జనం
4/6

మరిపెడలో జరిగిన డోర్నకల్‌ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన జనం

5/6

6/6

Advertisement
Advertisement