ఏటూరునాగారం: ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉధృతంగా ప్రవహిస్తున్న నడుములోతు నీటిలో నుంచి పాఠశాలకు వెళ్లి పాఠాలను బోధించారు. ఈ ఘటన ఏటూరునాగారం మండల పరిధిలోని ఎలిశెట్టిపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..ఎలిశెట్టిపల్లి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. అందులో 20 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సామల సతీష్ పనిచేస్తుండగా మరో ఉపాధ్యాయురాలు ఉంది. అయితే వాగులో నుంచి ఉపాధ్యాయురాలు వెళ్లలేని పరిస్థితి ఉండడంతో ఆమెను మండల కేంద్రంలోనే గతంలో డిప్యూటేషన్పై వేశారు. కాని హెచ్ఎం మాత్రం 2022 నుంచి ఎలిశెట్టిపల్లిలో టీచర్గా పనిచేస్తున్నారు. తుపాన్ కారణంగా వర్షాలు కురుస్తుండడంతో ఎలిశెట్టిపల్లి–బన్నాజీబంధం గ్రామాల మధ్యలోని జంపన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పిల్లలకు పాఠాలను చెప్పాలనే కృతనిశ్చయంతో హెచ్ఎం సతీష్ వాగుదాటి వెళ్లి విద్యార్థులకు పాఠాలను బోధించాడు. ఆ తర్వాత కూడా వాగుదాటి మండల కేంద్రానికి చేరుకున్నాడు. ఈ విషయాన్ని గ్రామస్తులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. గ్రామానికి టీచర్ రావాలన్నా.. వైద్యులు, సిబ్బంది రావాలాన్న ఈ వాగుదాటి రావాల్సి వస్తోందని గ్రామస్తులు వెల్లడించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం నాయకులను వాగుపై బ్రిడ్జి నిర్మించాలని 140 మంది ఓటర్లు ఓటు హక్కును బహిష్కరించారు. ఇప్పటికై నా వాగుపై బ్రిడ్జి నిర్మించాలని నూతన ప్రభుత్వాన్ని, అధికారులను గ్రామస్తులు వేడుకున్నారు.
వాగు దాటి వెళ్లి.. విద్యార్థులకు పాఠాలు
Published Thu, Dec 7 2023 12:52 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement