మారేడుగొండ చెరువు పరిశీలన | Sakshi
Sakshi News home page

మారేడుగొండ చెరువు పరిశీలన

Published Sat, Apr 20 2024 1:20 AM

చెరువును పరిశీలిస్తున్న అధికారులు  - Sakshi

వెంకటాపురం(ఎం): మండలంలోని లక్ష్మీదేవిపేట–బుర్గుపేట గ్రామాల మధ్యలో ఉన్న మారేడుగొండ చెరువును శుక్రవారం డీఆర్‌డీఓ శ్రీనివాస్‌ కుమార్‌, ఏపీడీ వెంకటనారాయణ పరీశీలించారు. గత సంవత్సరం జూలై 27న కురిసిన భారీవర్షానికి చెరువుకు పలు చోట్ల గండ్లు పడడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. లక్ష్మీదేవిపేట–బుర్గుపేట మధ్య గల రోడ్డు తెగిపోవడంతో పాటు వరదల్లో ఒ కే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతై మృతిచెందారు. చెరువుకు పడిన గండ్లను పూడ్చివేయకపోవడంతో పాటు చెరువుకు ఎలాంటి మరమ్మతు చేపట్టకపోవడంతో రైతులు పంటలు పండించుకో ని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు పలుమార్లు చెరువుకు మరమ్మతు చేపట్టాలని అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా కలెక్టర్‌ ఆదేశాల మేరకు అధికారులు చెరువును సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఈజీఎస్‌ అధికారులు కిషోర్‌, నారగోని సునీత, సు రేష్‌, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement