దరఖాస్తుల స్వీకరణ | Sakshi
Sakshi News home page

దరఖాస్తుల స్వీకరణ

Published Wed, May 31 2023 3:18 AM

-

కందనూలు: జిల్లాలోని 10 మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలల్లో 2023– 24 విద్యా సంవత్సరానికి గాను కిరాణ సరుకులు, క్యాటరింగ్‌, కూరగాయలు ఇతర సామగ్రి కోసం అర్హులైన సంస్థలు, వ్యక్తుల నుంచి టెండర్ల రూపకంగా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26 నుంచి వచ్చేనెల 6లోగా ప్రిన్సిపల్‌, మహాత్మ జ్యోతిబా పూలే తెలంగాణ వెనకబడిన తరగతుల గురుకుల విద్యాలయం (బాలికలు) నాగర్‌కర్నూల్‌ జిల్లా పేరిట ఎస్‌బీఐ నాగర్‌కర్నూల్‌లో డీడీ తీసి వాటిని, సంబంధిత ధ్రువపత్రాలు, డీడీలను ఉయ్యాలవాడ మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన బాక్స్‌లో వేయాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సెల్‌ నం.91211 07774ను సంప్రదించాలని సూచించారు.

Advertisement
Advertisement