దేవరకద్ర, మహబూబ్‌నగర్‌పై మీమాంస.. | Sakshi
Sakshi News home page

దేవరకద్ర, మహబూబ్‌నగర్‌పై మీమాంస..

Published Mon, Oct 16 2023 12:58 AM

-

దేవరకద్రలో పోటీపడుతున్న డీసీసీ అధ్యక్షుడు జి.మధుసూదన్‌రెడ్డి, ప్రదీప్‌రెడ్డి, కొండా ప్రశాంత్‌రెడ్డికి తోడు ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన సీతా దయాకర్‌రెడ్డి తన కుమారుడికి టికెట్‌ ఆశిస్తుండడం ఎంపిక క్లిష్టంగా మారింది. ఈ స్థానంపై కాంగ్రెస్‌ పెద్దల్లో మీమాంస కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలో ఒబేదుల్లా కొత్వాల్‌, సంజీవ్‌ ముదిరాజ్‌ టికెట్‌ కోసం పోటీపడుతున్నారు. ఇటీవల బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి హస్తం గూటికి చేరగా, ఆయన సైతం టికెట్‌ ఆశిస్తున్నారు. ఇక్కడ బీసీ, స్థానికత అంశానికి ప్రాధాన్యం ఏర్పడగా అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. బీసీలకు టికెట్ల కేటాయింపులో రాష్ట్రంలో ఏమైనా సమీకరణలు మారితే ఈ నియోజకవర్గంలో ఆ వర్గానికి దక్కే అవకాశమున్నట్లు సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు.

Advertisement
Advertisement