పట్టణంలో గురువారం రాత్రి సద్దుల బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. దసరా పండుగ తర్వాత సద్దుల బతుకమ్మ జరుపుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఈ మేరకు పట్టణంలోని వేంకటేశ్వరస్వామి, ఆంజనేయస్వామి ఆలయాల్లో పలు కాలనీలకు చెందిన మహిళలు, మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం దంపతులు బతుకమ్మ తీసుకువచ్చి ఆడిపాడారు. అనంతరం పట్టణంలోని హనుమాన్ ఆలయానికి బతుకమ్మలను తీసుకువచ్చారు. అక్కడి నుంచి కై లాసం గుట్టపైకి చేరుకొని బతుకమ్మ ఆడి గుండంలో నిమజ్జనం చేశారు. గుట్టపై బతుకమ్మ ఆడే మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు.