లింగాల: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ముస్లింల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని.. మూడోసారి బీఆర్ఎస్ గెలుపు తథ్యమని స్టేట్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ అచ్చంపేట ఇన్చార్జ్ ఇంతియాజ్ ఇసాక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ముస్లిం మైనార్టీలతో నిర్వహించిన సమావేవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో ముస్లింల సంక్షేమాన్ని కోరేది కేసీఆర్ మాత్రమేనని.. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో, అచ్చంపేటలో బీఆర్ఎస్ జెండా ఎగురడం ఖాయమని తెలిపారు. ముస్లింలు సంఘటితంగా ఉండి బీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు తెలుపాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు అమీనోద్దీన్, జడ్పీటీసీ మాజీ సభ్యుడు మాకం తిరుపతయ్య, పార్టీ మండల అధ్యక్షుడు సుధీర్గౌడ్, సర్పంచ్ కె.తిరుపతయ్య, మైనార్టీ నాయకులు సిరాజ్ఖాన్, సింగిల్విండో వైస్ చైర్మన్ వెంకటగిరి, మల్లేష్, శంకర్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
స్టేట్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్
ఇంతియాజ్ ఇసాక్