పెయిడ్‌ న్యూస్‌పై ప్రత్యేక దృష్టి | Sakshi
Sakshi News home page

పెయిడ్‌ న్యూస్‌పై ప్రత్యేక దృష్టి

Published Sat, Nov 11 2023 1:28 AM

-

మీడియా సర్టిఫికేషన్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు నిర్వహిస్తున్న ఎంసీఎంసీ పనితీరుకు సంబంధించిన ఏర్పాట్ల రికార్డులను, రోజువారి దినపత్రికల క్లిప్పింగ్‌లను వారు పరిశీలించారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్‌ ద్వారా ప్రింట్‌అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియాకు అందించాలని సూచించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ సెల్‌ బాధ్యతలు నిర్వహించాలని ఆదేశించారు. ఎంసీఎంసీ సెల్‌ ద్వారా చెల్లింపు వార్తలను గుర్తించడం, ప్రచురణ, ముందస్తు అనుమతి లేకుండా ప్రకటనలను ప్రసారం చేయడం, సంబంధిత అభ్యర్థి ప్రచార వ్యయంలో వాటిని లెక్కించడం, సోషల్‌ మీడియాలో అభ్యర్థులు రాజకీయ పార్టీల ప్రకటనలకు వంటివి సకాలంలో గుర్తించాలన్నారు. రెండు టీవీలను అదనంగా ఏర్పాటు చేయాలని, ఎప్పటికప్పుడు ఎలక్ట్రానిక్‌ మీడియాలో వస్తున్న వార్తలపై ప్రత్యేకంగా నిఘా ఉంచాలని సూచించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement