వెనుకబడిన విద్యార్థుల్లో మార్పు తీసుకురావాలి | Sakshi
Sakshi News home page

వెనుకబడిన విద్యార్థుల్లో మార్పు తీసుకురావాలి

Published Thu, Nov 16 2023 1:14 AM

-

లింగాల: చదువులో వెనుకబడిన విద్యార్థుల్లో, చదువుపై ఆసక్తి కలిగేలా మార్పు తీసుకురావాలని విద్యాశాఖ జిల్లా పరిశీలకులు ఏఎంఓ షర్ఫొద్దీన్‌, ఏఎస్‌ఓ మురశీధర్‌రెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో కాంప్లెక్స్‌ సమావేశం నిర్వహించారు. సమావేశంలో కాంప్లెక్స్‌ పరిధిలోని ఉపాధ్యాయులకు బోధనలో అనుసరించాల్సిన పలు అంశాలపై అవగాహన కల్పించారు. సామర్థ్యాల పెంపు, బోధన పరికరాల వినియోగం, ప్రదర్శన, వర్క్‌ షీట్‌ వినియోగం, విద్యార్థుల ఆన్‌లైన్‌ ఎఫ్‌ఆర్‌ఎస్‌ అంశాలపై అవగాహన కల్పించారు.

Advertisement
Advertisement