ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలి | Sakshi
Sakshi News home page

ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలి

Published Sat, Nov 25 2023 1:38 AM

డ్రైవర్లకు, కండక్టర్లకు ప్రశంసాపత్రాలు అందజేస్తున్న రీజినల్‌ మేనేజర్‌ శ్రీదేవి  - Sakshi

నాగర్‌కర్నూల్‌ క్రైం: ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు ఆర్టీసీకి ఆదాయం వచ్చేందుకు కృషిచేయాలని రీజినల్‌ మేనేజర్‌ శ్రీదేవి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో అవార్డు పంక్షన్‌ నిర్వహించి డిపోకు ఎక్కువ ఆదాయం తీసుకొచ్చిన డ్రైవర్లకు, కండక్టర్లను సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కురుమూర్తి జాతరకు నడిపిన స్పెషల్‌బసుల్లో నాగర్‌కర్నూల్‌ డిపో ఆదాయంలో 5వ స్థానంలో నిలిచిందని చెప్పారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలను చేర్చడంతో పాటు అధిక సంఖ్యలో ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించేలా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డిపో మేనేజర్‌ దేవరాజ్‌, డిపో డిప్యూటీ ఆర్‌ఎంఓ బాబునాయక్‌, శ్రీనివాస్‌రెడ్డి, ఆంజనేయులు, వీఎస్‌ నారాయణ ఉన్నారు.

రీజినల్‌ మేనేజర్‌ శ్రీదేవి

Advertisement
Advertisement