యాత్రను జయప్రదం చేయాలి | Sakshi
Sakshi News home page

యాత్రను జయప్రదం చేయాలి

Published Fri, Mar 17 2023 2:02 AM

-

నల్లగొండ టౌన్‌: బీజేపీ మతోన్మాద, కార్పొరేట్‌ విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 17 నుంచి 29 వరకు నిర్వహించే జనచైతన్య యాత్రను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుదాకర్‌రెడ్డి కోరారు. గురువారం నల్లగొండలోని పార్టీ కార్యాలయంలో జనచైతన్య యాత్ర పోస్టర్‌ను ఆవిస్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తు కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. జనచైతన్య యాత్ర 17న వరంగల్‌లో ప్రారంభమై 27న నల్లగొండకు చేరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, బండా శ్రీశైలం, పాలడుగు నాగార్జున, సయ్యద్‌హాషం, పాలడుగు ప్రభావతి, చిన్నపాక లక్ష్మీనారాయణ, సలీం పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement