Sakshi News home page

మల్లు స్వరాజ్యంకు ఘన నివాళి

Published Mon, Mar 20 2023 1:46 AM

నల్లగొండలో మల్లు స్వరాజ్యం చిత్రపటానికి
నివాళులర్పిస్తున్న సీపీఎం నాయకులు - Sakshi

నల్లగొండ టౌన్‌ : తెలంగాణ సాయుధ పోరాట యోదురాలు మల్లు స్వరాజ్యం మృతి సీపీఎం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మల్లు స్వరాజ్యం ప్రధమ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో భూమి.. భుక్తి.. వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిన ఉద్యమంలో ఆమె కీలక పాత్ర పోషించారని కొనియాడారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మల్లు గౌతమ్‌రెడ్డి, బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, లక్ష్మీనారాయణ, ప్రభావతి, సలీం, పుచ్చకాయల నర్సిరెడ్డి, సత్తయ్య, పద్మ, యాదగిరి, నగేష్‌, అరుణకుమారి, అశోక్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

నకిరేకల్‌ : మల్లు స్వరాజ్యం వర్ధంతిని ఆదివారం నకిరేకల్‌లో సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి వంటెపాక వెంకటేశ్వర్లు, నాయకులు ప్రకాష్‌రావు, సాకుంట్ల నర్సింహ, నాగమణి, శశికళ, లక్ష్మి, వంటెపాక కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కేతేపల్లి : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మొదటి వర్ధంతిని ఆదివారం కేతేపల్లిలో సీపీఎం నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల స్మారక భవనంలో ఆమె చిత్రటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ చినవెంకులు, మండల కార్యదర్శి సీహెచ్‌.లూర్ధుమారయ్య, నాయకులు ఏళ్ళ అశోక్‌రెడ్డి, కోట లింగయ్య, వి.సౌడయ్య తదితరులు పాల్గొన్నారు.

చిట్యాల : తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం వర్ధంతిని చిట్యాలలోని సీపీఎం కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వరాజ్యం చిత్రపటానికి పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్‌, అవిశెట్టి శంకరయ్య, జిట్ట సరోజ పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ మండల కార్యదర్శి అర్రూరి శ్రీను, నారబోయిన శ్రీనివాసులు, శీలా రాజయ్య, రుద్రారపు పెద్దులు, బూరుగు కృష్ణవేణి, కందుల అనిత, అక్కనపల్లి నాగయ్య, గుడిసె లక్ష్మీనారాయణ, శేఖర్‌ పాల్గొన్నారు.

నార్కట్‌పల్లి : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ప్రథమ వర్ధంతిని మండల కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్వరాజ్యం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి చెరుకు పెద్దులు, వైస్‌ ఎంపీపీ కల్లూరి యాదగిరి, కొప్పు శ్రవణ్‌కుమార్‌, నన్నేసాబ్‌, దండు రవి, సైదులు, అర్దం శ్రీను, బోయపల్లి శ్రీనివాస్‌లు ఉన్నారు.

మర్రిగూడ : మల్లు స్వరాజ్యం ప్రథమ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని ఆమె చిత్రపటానికి సీపీఎం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, సీఐటీయూ నాయకులు ఎడ్ల అంజయ్య, లపంగి ముసలయ్య తదితరులు పాల్గొన్నారు.

శాలిగౌరారం : మండల కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు మల్లు స్వరాజ్యం ప్రథమ వర్ధంతిని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి చలకాని మల్లయ్య, సిరుపంగి రాములు, బాల్‌రెడ్డి, గట్టయ్య, లింగయ్య, జగన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement