ప్రకృతి వ్యవసాయ క్షేత్రం పరిశీలన | Sakshi
Sakshi News home page

ప్రకృతి వ్యవసాయ క్షేత్రం పరిశీలన

Published Wed, Mar 29 2023 2:36 AM

ఆలయంలో నిత్య కల్యాణం 
నిర్వహిస్తున్న ఆచార్యులు     - Sakshi

తుర్కపల్లి: అసోం రాష్ట్ర వ్యవసాయ అధికారులు మండలంలోని వాసాలమర్రి గ్రామంలో గల అరుణ్‌ ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ మేనేజ్‌మెంట్‌, హైదరాబాద్‌లో జరుగుతున్న ట్రైనింగ్‌లో భాగంగా మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా గానుగతో నూనె తయారీ విధానం, సేంద్రియ ఎరువులు, జీవామృతం, ఘన జీవామృతం తయారీని పరిశీలించారు. ఐదు దొంతర్ల పద్ధతి ద్వారా పండ్ల మొక్కల పెంపకం గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అసోం రాష్ట్ర ఏడీఓ పీపీ ఉపానంద పట్వారీ, బీటీఎం బర్నాలి దాస్‌, బోడాన్‌ లోహాన్‌, నూమల్‌ డీయోరీ బారాలీ, ఉదీప్త కున్వార్‌, రంజీత్‌ బోరా, సుక్యన గోగీ, దబ్‌జీత్‌ సేనాపతి, శ్యామాల్‌ బూరా, బీపీల్‌ కేర్‌నాథ్‌, జోయాగోస్వామి, ముత్యుజయ శిఖా, సంతోష్‌ గుహన్‌, మృణాల్‌ కాంత్‌, ధనుంజయ ముసారి, రాజు పుకాన్‌, పరంజీత్‌ భూయన్‌, జయంతా మదుహదత్‌, కమలేందర్‌ బ్రహ్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రిలో నిత్య పూజలు

యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయంలో మంగళవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. క్షేత్రపాలకుడిగా కొనసాగుతున్న ఆంజనేయస్వామికి ఇష్టమైన రోజు కావడంతో ఆచార్యులు అకుపూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆంజనేయస్వామిని సింధూరంతో అభిషేకించి, తమలపాకులతో అర్చించారు. అనంతరం అంజనీపుత్రుడికి ఇష్టమైన నైవేద్యాన్ని ఆరగింపు పెట్టారు. ప్రధానాలయంలో, విష్ణు పుష్కరిణి, అనుబంధ ఆలయాలైన శివాలయం, పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాల వద్ద ఉన్న ఆంజనేయస్వామిని భక్తులు మొక్కుకొని, పూజలు చేశారు. ఇక ప్రధానాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు సంప్రదాయ పూజలు కొనసాగాయి. సుప్రభాతం, అభిషేకం, అర్చన, శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, జోడు సేవలను విశేషంగా నిర్వహించారు.

ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో 
అసోం రాష్ట్ర వ్యవసాయ అధికారులు
1/1

ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో అసోం రాష్ట్ర వ్యవసాయ అధికారులు

Advertisement
Advertisement