అత్యాచారం కేసులో 20ఏళ్లు జైలు శిక్ష | Sakshi
Sakshi News home page

అత్యాచారం కేసులో 20ఏళ్లు జైలు శిక్ష

Published Thu, Nov 16 2023 6:06 AM

-

మోత్కూరు: బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో ఓ యువకుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.11వేల జరిమానా విధిస్తూ భువనగిరి కోర్టు తీర్పు ఇచ్చినట్లు మోత్కూరు ఎస్‌ఐ ఏమిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి బుధవారం తెలిపారు. మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామానికి చెందిన బూడిద ప్రవీణ్‌ అదే గ్రామానికి చెందిన బాలికపై 2022లో అత్యాచారానికి పాల్పడిన ఘటనలో కేసు నమోదైంది. బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం నిందితుడికి శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా బాధితురాలికి ప్రభుత్వం రూ.5 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించినట్లు తెలిపారు.

Advertisement
Advertisement