రోడ్‌ షోలో ఎన్‌ఎస్‌యూఐ నేతల నిరసన | Sakshi
Sakshi News home page

రోడ్‌ షోలో ఎన్‌ఎస్‌యూఐ నేతల నిరసన

Published Thu, Nov 23 2023 1:52 AM

ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో 
చేరుతున్న బోయినపల్లి కృష్ణారెడ్డి  - Sakshi

చౌటుప్పల్‌: ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం చౌటుప్పల్‌ పట్టణంలో రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ రోడ్‌ షో నిర్వహించారు. ఈ రోడ్‌ షో జరుగుతున్న సమయంలో కొందరు ఎన్‌ఎస్‌యూఐ నేతలు ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. చౌటుప్పల్‌ పట్టణ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, టీఎస్‌పీఎస్పీ ద్వారా ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎన్‌ఎస్‌యూఐ మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు రాచకొండ భార్గవ్‌ ఆధ్వర్యంలో పలువురు నినాదాలు చేశారు. అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకున్నారు. నిరసన వ్యక్తం చేసిన వారిలో ఎన్‌ఎస్‌యూఐ నేతలు శివ, శ్రవణ్‌, దిలీప్‌, శ్రీకాంత్‌ తదితరులు ఉన్నారు.

కాంగ్రెస్‌ పార్టీలోకి

మాజీ మున్సిపల్‌ చైర్మన్‌

నల్లగొండ: నల్లగొండ మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ బోయినపల్లి కృష్ణారెడ్డితో పాటు పలువురు మాజీ కౌన్సిలర్లు బీఆర్‌ఎస్‌ని వీడి కాంగ్రెస్‌లో చేరారు. బుధవారం నల్లగొండలో నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ ప్రజా భరోసా సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, నల్లగొండ కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు మాజీ కౌన్సిలర్లు మందడి మధుసూదన్‌రెడ్డి, సురిగి మారయ్య, గుబ్బ శ్రీనివాస్‌ కూడా కాంగ్రెస్‌లో చేరారు.

చంటిపాపతో సభకు హాజరై 
సెల్ఫీ దిగుతున్న మహిళ
1/1

చంటిపాపతో సభకు హాజరై సెల్ఫీ దిగుతున్న మహిళ

Advertisement
Advertisement