కబడ్డీ అసోసియేషన్‌ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక | Sakshi
Sakshi News home page

కబడ్డీ అసోసియేషన్‌ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

Published Wed, Nov 29 2023 2:24 AM

-

మిర్యాలగూడ టౌన్‌: నాగార్జునసాగర్‌లో ఇటీవల కబడ్డీ అసోసియేషన్‌ నల్లగొండ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ అసోసియేషన్‌ రాష్ట్ర పరిశీలకుడు రవికుమార్‌, సంయుక్త కార్యదర్శి చంద్రకుమార్‌ తెలిపారు. మంగళవారం మిర్యాలగూడలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కబడ్డీ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడిగా రామినేని భూలోకరావు, ఉపాధ్యక్షులుగా వెంకటరత్నం, దోమ్నిక్‌, ప్రధాన కార్యదర్శిగా జి.కర్తయ్య, సహాయ కార్యదర్శులుగా జంగా లక్ష్మణ్‌ యాదవ్‌, శ్రీకాంత్‌, అంజయ్య, కోశాధికారిగా చంద్రయ్య ఎన్నికయ్యారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి భూలోకరావు, కర్తయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని కబడ్డీ క్రీడాకారులను గుర్తించి మట్టిలో మాణిక్యాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లా కమిటీ ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అసోసియేషన్‌ తోపాటు ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
Advertisement