మానవ అక్రమ రవాణా అతిపెద్ద నేరం | Sakshi
Sakshi News home page

మానవ అక్రమ రవాణా అతిపెద్ద నేరం

Published Wed, Nov 29 2023 2:24 AM

మాట్లాడుతున్న బాలరామకృష్ణ 
 - Sakshi

నాగార్జునసాగర్‌: ఉద్యోగాలు ఇప్పిస్తాం, సినిమాల్లో అవకాశాలు కల్పిస్తామంటూ మహిళలు, యువతులకు డబ్బు ఆశ చూపి ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలించి వ్యభిచార గృహాలకు విక్రయిస్తున్నారని, ఇది అతిపెద్ద నేరమని ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ సీనియర్‌ మేనేజర్‌ కె.బాలరామకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం సాగర్‌లోని బీసీ గురుకుల విద్యాలయంలో ఆ సంస్థకు చెందిన పద్మశ్రీ డాక్టర్‌ సునీత కృష్ణన్‌ సహకారంతో ప్రిన్సిపాల్‌ రవీంద్రాచారి, రజనీకర్‌ ఆధ్వర్యంలో విద్యార్థుల చైతన్య కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పిల్లలను అపహరించి వారి శ్రమను దోచుకోవడంతో పాటు అవసరం మేరకు అవయావలను తొలగించి ఇతరులకు విక్రయిస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖల సాయంతో ఇప్పటివరకు 28,200మంది అమ్మాయిలను, మహిళలను కాపాడి పురావాసం కల్పించామన్నారు. సెల్‌ మెసేజ్‌లు, వ్యక్తులపై అనుమానమొస్తే 1930నంబర్‌ను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజ్వల అసిస్టెంట్‌ కోఆర్డినేటర్‌ శ్రావ్యసృతి, శివ, అనిల్‌, ఫ్యాకల్టీ పాల్గొన్నారు.

Advertisement
Advertisement