మహిళలపై హింసను అరికట్టాలి | Sakshi
Sakshi News home page

మహిళలపై హింసను అరికట్టాలి

Published Sun, Dec 3 2023 1:30 AM

అవగాహన ర్యాలీలో పాల్గొన్న వైద్యులు
 - Sakshi

నకిరేకల్‌ : మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టాలని సీ్త్రల వైద్యనిపుణల సంఘం జిల్లా కార్యదర్శి డాక్టర్‌ రాపోలు మంజుల కోరారు. మహిళపై హింస నివారణ దినోత్సవం సందర్భంగా నకిరేకల్‌లో శనివారం ఆ సంఘం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలపై ఇంకా శారీరక, మానసిక, లైంగిక దాడులు దాడులు జరుగుతున్నాయన్నారు. ఈ విషయంలో పాలక ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలను తెచ్చి హింస జరగకుండా అరికట్టాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు సుచరిత, శ్రీకాంత్‌, సిబ్బంది వినయ్‌కుమార్‌, హరీష్‌, శివ, జయ, కరుణాకర్‌ ఉన్నారు.

Advertisement
Advertisement