కృష్ణ శిలలతో మహారాజ గోపుర నిర్మాణం | Sakshi
Sakshi News home page

కృష్ణ శిలలతో మహారాజ గోపుర నిర్మాణం

Published Tue, Dec 5 2023 4:54 AM

-

అర్వపల్లి : అర్వపల్లిలోని శ్రీయోగానందలక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో మహారాజ గోపురాన్ని కృష్ణ శిలలతో నిర్మిస్తున్నారు. సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి సొంత ఖర్చులు సుమారు రూ.1.30కోట్లతో గతంలోనే పనులు ప్రారంభించారు. మహారాజ గోపురం నిర్మాణంలో భాగంగా ప్రస్తుతం పునాది పనులు పూర్తి కాగా రాతి పనులు మొదలు పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కోటప్పకొండ నుంచి కృష్ణ శిలలను తెప్పించారు. 18 అడుగుల ఎత్తు వరకు రాతితో నిర్మించి ఆ తర్వాత ఇటుకలతో పనులు చేపడుతున్నారు. ఈ మహారాజ గోపురం 55 అడుగుల ఎత్తు ఉండనుంది. తమిళనాడు నుంచి శిల్పులను పిలిపించి వారితో పనులు చేయిస్తున్నారు.

Advertisement
Advertisement