చికిత్స పొందుతూ మహిళ మృతి | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ మహిళ మృతి

Published Fri, Dec 8 2023 7:24 AM

తేజస్విని (ఫైల్‌) - Sakshi

శాలిగౌరారం : కడుపునొప్పి భరించలేక పురుగుల మందు తాగిన ఓ మహిళ ఆస్పత్రిలో చిక్సిత పొందుతూ గురువారం మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని ఉప్పలంచ గ్రామంలో జరిగింది. ఎస్‌ఐ సతీష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఉప్పలంచ గ్రామానికి చెందిన మాదాని తేజస్విని(23) ప్రైవేట్‌స్కూల్‌ టీచర్‌గా పనిచేస్తుంది. తేజస్విని నెలసరి సమయంలో వస్తున్న కడుపునొప్పితో కొంతకాలంగా బాధపడుతుంది. ఈనెల 4న తీవ్రంగా కడుపునొప్పి రావడంతో తట్టుకోలేక ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కొంత సమయం తర్వాత ఇంటికి వచ్చిన ఆమె భర్త మెల్వన్‌ తన భార్య నోటి నుంచి నురగలు వచ్చి కిందపడిపోయి ఉండటాన్ని గమనించి ఆమెను ద్విచక్రవాహనంపై నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించాడు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతురాలి తండ్రి పొలిశెట్టి బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు. మృతురాలికి భర్త, 16నెలల కుమారుడు ఉన్నారు.

Advertisement
Advertisement