కేతేపల్లి: తమకు ఇవ్వాల్సిన బాకీ డబ్బులు ఇవ్వకపోవడంతోనే తమ తండ్రి అనారోగ్యం పాలై మృతిచెందాడని ఆరోపిస్తూ మృతుడి కుటుంబ సభ్యులు మృతదేహంతో ఆందోళన చేపట్టారు. ఈ ఘటన కేతేపల్లి మండలం కొర్లపహాడ్ గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. కొర్లపహాడ్ గ్రామానికి చెందిన గుండ్లపల్లి ఉపేందర్రావు తక్కువ ధరకు భూమి ఇప్పిస్తానని చెప్పి అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బయ్య భిక్షమయ్యయాదవ్ నుంచి 2017లో రూ.70లక్షలు తీసుకున్నాడు. ఏళ్లు గడుస్తున్నా ఉపేందర్రావు భిక్షమయ్యకు భూమి ఇప్పించకపోగా తీసుకున్న డబ్బులు కూడా ఇవ్వడం లేదు. దీంతో భిక్షమయ్య గ్రామ పెద్దలను ఆశ్రయించాడు. కాగా మూడేళ్ల క్రితం ఉపేందర్రావు తన కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న ఐదెకరాల భూమిని భిక్షమయ్యకు రిజిష్ట్రేషన్ చేస్తానని పెద్ద మనుషుల సమక్షంలో హామీ ఇచ్చాడు. రిజిష్ట్రేషన్ చేసేంత వరకు ఆ భూమిని భిక్షమయ్య సాగు చేసుకునేందుకు కూడా ఉపేందర్రావు అంగీకరించాడు. మూడేళ్లవుతున్నా ఉపేందర్రావు భూమిని రిజిస్ట్రేషన్ చేయకపోగా.. కొంతకాలంగా కుటుంబంతో సహా హైదరాబాద్లో ఉంటున్నాడు. లక్షల రూపాయల డబ్బులు పోవటంతో పాటు భూమి కూడా రాకపోవటంతో తీవ్ర మనస్తాపానికి గురైన భిక్షమయ్య అనార్యోగం బారిన పడ్డాడు. నాలుగు రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైన భిక్షమయ్యను కుటుంబ సభ్యులు సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా శనివారం రాత్రి మృతిచెందాడు. భిక్షమయ్య మృతిచెందిన విషయాన్ని గ్రామస్తులు ఉపేందర్రావుకు తెలియజేసి గ్రామానికి రావాలని కోరారు. తాను అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరానని, రాలేనంటూ చెప్పాడు. ఆగ్రహించిన మృతుడి కుటుంబ సభ్యులు ఆదివారం భిక్షమయ్య మృతదేహాన్ని గ్రామంలో తాళం వేసి ఉన్న ఉపేందర్రావు ఇంటి ఆవరణలో ఉంచి అక్కడే మృతదేహాన్ని ఖననం చేస్తామంటూ గుంత తవ్వారు. విషయం తెలుసుకున్న కేతేపల్లి ఎస్ఐ శ్రీకాంత్గౌడ్ గ్రామానికి చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామ పెద్ద మనుషులతో చర్చలు జరిపారు. ఉపేందర్రావు గ్రామానికి తీసుకువచ్చి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించి మృతదేహాన్ని తమ ఇంటికి తీసుకెళ్లారు.
మృతదేహంతో ఆందోళన
Published Mon, Dec 11 2023 9:40 AM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ
శ్రీరామానంద స్వామిజీ పాదయాత్ర
కుంభకోణాలకు చట్టబద్ధత కల్పించింది బీజేపీయే
No Headline
‘దేవర’ చిత్ర యూనిట్ను వదలని తేనెటీగలు
హోరెత్తిన ఎన్నికల ప్రచారం
సంక్షేమ ప్రభుత్వానికి ప్రజల మద్దతు
మన్యంలో మోసగాడు
పశువుల కోసం వెళ్లి గోదావరిలో పడి విద్యార్థి మృతి
హైరిస్క్ గర్భిణుల గుర్తింపు
తప్పక చదవండి
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!
- అయ్యయ్యో సేతిలో డబ్బులు పోయెనే.. జేబులు ఖాళీ ఆయనే
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- కష్టాల్లో 'పద్మ శ్రీ మొగిలయ్య'.. సాయం చేసిన బుల్లితెర నటి
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement