ఫ హాజరుకానున్న మంత్రి కోమటిరెడ్డి
నల్లగొండ: జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఈ నెల 23వ తేదీ ఉదయం 10.30 గంటలకు జెడ్పీ సర్వసభ్య సమావేశం జరుగనుంది. జెడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జరిగే ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించే అవకాశం ఉండనుందని కార్యాలయ వర్గాలు తెలిపాయి.
ఎఫ్సీఐ డీఎంగా సుశీల్కుమార్సింగ్
నల్లగొండ: జిల్లా భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) నల్లగొండ డివిజనల్ మేనేజర్గా సుశీల్కుమార్సింగ్ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న వరుణ్కుమార్ సూద్ గుజరాత్ రాష్ట్రానికి బదిలీ కాగా ఈయన స్థానంలో ఒడిశాలోని కటక్ జిల్లాలో డీఎంగా పనిచేస్తున్న సుశీల్కుమార్సింగ్ను నల్లగొండ డీఎంగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఏజీఎంగా పనిచేస్తున్న సతీష్ చంద్రన్కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. సుశీల్కుమార్ సింగ్ నల్లగొండలో ఈ నెలాఖరులోగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. బదిలీ అయిన వరుణ్కుమార్ సూద్ 2022 ఏప్రిల్ నుంచి ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు.