బీజేపీ జిల్లా కార్యవర్గం నియామకం | Sakshi
Sakshi News home page

బీజేపీ జిల్లా కార్యవర్గం నియామకం

Published Sun, Mar 10 2024 7:50 AM

ఫొటో గ్రాలరీని పరిశీలిస్తున్న పర్యాటకులు   
 - Sakshi

నల్లగొండ టూటౌన్‌ : బీజేపీ జిల్లా కార్యవర్గాన్ని నియమిస్తూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ నాగం వర్షిత్‌రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా ఉపాధ్యక్షులుగా దర్శనం వేణుకుమార్‌, రేపాల పురుషోత్తంరెడ్డి, మండల వెంకన్న, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, మిర్యాల వెంకటేశం, సోమ నరసింహగుప్తా, వనం నరేందర్‌రెడ్డి నియమితులయ్యారు. ప్రధాన కార్యదర్శులుగా చనమోని రాములు, పోతెపాక లింగస్వామి, జిల్లా కార్యదర్శులుగా కంచర్ల విద్యాసాగర్‌రెడ్డి, బొడిగ అశోక్‌గౌడ్‌, వస్కుల సుధాకర్‌, పెందోటి శిరీషయాదవ్‌, చిలువేలు దుర్గయ్య, పజ్జూరి వెంకట్‌రెడ్డిని నియమించారు. కోశాధికారిగా ఫకీరు మోహన్‌రెడ్డి, ఉప కోశాధికారిగా మిట్టపల్లి రామకృష్ణ, కార్యాలయ కార్యదర్శిగా పాశం శ్రీనివాస్‌రెడ్డి నియమితులయ్యారు.

వివిధ మోర్చాల అధ్యక్షుల నియామకం..

బీజేపీ వివిధ మోర్చాల జిల్లా అధ్యక్షులను కూడా నియమించారు. బీజేవైఎం వంగూరి రాఖీ, ఓబీసీ మోర్చా పిట్టల శ్రీనివాస్‌, ఎస్టీ మోర్చా ఇస్లావత్‌ బాలాజీనాయక్‌, అధికార ప్రతినిధులుగా పెరిక మునికుమార్‌, బొమ్మరగోని రాజ్‌ముదిరాజ్‌ నియమితులయ్యారు.

రాచకొండ ఉత్సవాలు ప్రారంభం

సంస్థాన్‌ నారాయణపురం : రాచకొండ పర్యాటక ఉత్సవాలను రాచప్ప కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. రాచకొండ చరిత్రను తెలియజేసే ఫొటో గ్యాలరీని పర్యాటకులు వీక్షించారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టకున్నాయి. రాచకొండ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించాలని రాచప్ప కమిటీ ప్రతినిధులు కోరారు.

Advertisement
Advertisement