Sakshi News home page

కంప్యూటర్‌ ఆపరేటర్లకు స్థానాల కేటాయింపు

Published Wed, Nov 15 2023 1:52 AM

-

● కౌన్సెలింగ్‌ ద్వారా మండలాలకు నియామకం ● నేడు సాంకేతిక సహాయకులకు కౌన్సెలింగ్‌

కర్నూలు(అగ్రికల్చర్‌): రేషనలైజేషన్‌లో భాగంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు కొద్ది నెలల క్రితం బదిలీ అయిన కంప్యూటర్‌ అపరేటర్లు, సాంకేతిక సహాయకుల్లో (టీఏ) పలువురిని గ్రామీణాభివృద్ధి శాఖ తిరిగి ఉమ్మడి కర్నూలు జిల్లాకు కేటాయించింది. ఉమ్మడి జిల్లాకు 92 మంది కంప్యూటర్‌ ఆపరేటర్లు, 140 మంది సాంకేతిక సహాయకులు రావడంతో వారికి కౌన్సెలింగ్‌ ద్వారా మండలాలు కేటాయించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా యూనిట్‌గా కర్నూలు జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం 92 మంది కంప్యూటర్‌ ఆపరేటర్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. బుధవారం సాంకేతిక సహాయకులకు జిల్లా నీటియాజమాన్య సంస్థ కార్యాలయంలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. కర్నూలు డ్వామా పీడీ ఆధ్వర్యంలోని కమిటీలో నంద్యాల జిల్లా డ్వామా పీడీ రామచంద్రారెడ్డి, డీఆర్‌డీఏ–వైకేపీ ప్రాజెక్టు డైరెక్టర్‌ సలీమ్‌బాషా, డ్వామా పరిపాలనాధికారి విజయలక్ష్మి ఉన్నారు.

Advertisement
Advertisement