కర్నూలు (టౌన్): అస్సాం రాష్ట్రం గౌహతిలో ఈనెల 23 నుంచి 26 వరకు నిర్వహించనున్న జాతీయ స్థాయి యోగా సబ్ జూనియర్, జూనియర్ బాలబాలికల పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్లను ఎంపిక చేశారు. స్థానిక స్పోర్ట్స్ అథారిటీ ఔట్డోర్ స్టేడియంలో రాష్ట్ర యోగా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర యోగా సంఘం చైర్మన్ దండు లక్ష్మీకాంత రెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 9, 10 తేదీల్లో కర్నూలు వేదికగా నిర్వహించిన 48వ రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన వారిని జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు చెప్పారు.
సబ్ జూనియర్ బాలుర విభాగంలో... సీహెచ్ జైదీప్ రెడ్డి, సాత్విక్, షణ్ముఖ చౌదరి, చతుర్వేది, దేవాన్ష్ నాయుడు, సోమ సూర్య కిరణ్, సందీప్, ధీరశ్రీక్రిష్ణ
సబ్ జూనియర్ బాలికల విభాగంలో.. లక్ష్మీ చందన, రెహ వినూత్న రెడ్డి, మను, శ్రీకృతి, కృష్ణప్రియ, నిషా, కీర్తి, మనస్విని, హర్షవర్ధని
జూనియర్ బాలుర విభాగంలో.. శివప్రసాద్, శ్రీధర్మ, గణేష్, ధన థీరజ్
జూనియర్ బాలికల విభాగంలో.. తస్లీమా, ఆర్మిత, భవానీ చౌదరి, తన్వీర్, ఫాతిమాబేగం, వెంకటత్రివేణీ, ఇంద్రాణీ